Monday, 30 July 2018

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వమే : ఆత్రం సక్కు


రెబ్బెన :  వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆత్రం సక్కు అన్నారు.సోమవారం రెబ్బెన మండల కేంద్రంలో శక్తి ప్రాజెక్టు,ఓటరు మ్యాపింగ్ బూత్లెవల్ కార్యకర్తలకు  పై ఏర్పాటు చేసిన అవగహన సదస్సులో అయన మాట్లాడుతు ప్రతి ఒక్క కాంగ్రెస్  కార్యకర్త బూత్ లెవల్ గ్రామాలను సందర్శించి ఓటర్లను మ్యాపింగ్ చేసి తెరాస  ప్రభుత్వం ఎన్నికల్లో  ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు,మూడెకరాల భూమి తదితర విషయాలను అడిగితెలుసుకోవాలన్నారు. అర్హత ఉన్న కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందని వారికి ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని సూచించారు.ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకునే ప్రభుత్వం తెరాస నాయకులకే ఫ్రెండ్లీ గా ఉంటున్నారు తప్ప సామాన్య వ్యక్తులకు ఫ్రెండ్లీగా ఉండటం లేదన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు వారి తెరాస కార్యకర్తలకే అందాయని వారేనా రైతులు అని ఘాటుగా విమర్శించారు.అర్హత ఉన్న ఎంతో మందికి ట్రాక్టరులు అందలేదని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు మంగ,ముంజం రవీందర్ మండలాధ్యక్షుడు,గాజుల రవీందర్ పిఏసియస్ ఛైర్మెన్,వెంకన్న చారి,వైస్ ప్రెసిడెంట్,దుర్గం దేవాజి మండల ప్రధాన కార్యదర్శి,దుర్గం రాజేష్ ఉపాధ్యక్షుడు,నాయకులు మొండయ్య,ఆత్మరం,వస్రం నాయక్,హరీష్,జగన్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment