కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 24 ; గ్రమపంచాయితి కార్మికుల డిమాండ్ల పరిష్కారానికై నిర్వస్తున్న నిరవధిక సమ్మె రెబ్బెన మండల కేంద్రంలో మంగళవారం తహశీల్ధార్ కార్యాలయం ఎదుట రెండవరోజు చేరుకుంది. ఈ సమ్మెకు తెలంగాణ జనసమితి మద్దతు పలికారు.ఈ సందర్బంగా జనసమితి జిల్లా కన్వీనర్ లావుడ్య ప్రేమ్ నాయక్ మాట్లడుతు సమానపకి సమాన వేతనం మరియు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. గ్రామపంచాయితీల్లో ప్రభుత్వం కొత్తగా నియమించే 9200ల ఉద్యోగాల్లో ఉన్నవారిని అవకాశం కల్పించాలన్నారు. పరిసరాలను పరిశుబ్రాంగా ఉంచేందుకు కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని వారి నుండి వెట్టి చాకిరి చేయించుకొని సమాన వేతనం కల్పించకుండ అన్యాయం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాల్లో టిఆర్ఎస్వి జిల్లా కార్యదర్శి సుధాకర్,టీజెఏసి జిల్లా కన్వీనర్ ఎం దేవేందర్,మండల కన్వీనర్ గోగర్ల రాజేష్,ఏ గోపి,ఎం తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment