Tuesday, 3 July 2018

ఎంపిడిఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ ఉద్యోగుల నిరసన

  కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 03  ;: మండలకేంస్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట గ్రామపంచాయతీ ఉద్యోగులును ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేస్తూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో   మంగళవారం ధర్నా నిర్వహించి సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్,  టిఆర్ఎస్ కొమురంభీం  జిల్లా కార్యదర్శి ఎన్. సుధాకర్ లు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్న గ్రామపంచాయతీ ఉద్యోగులను ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని   అనంతరం వారు మాట్లాడుతూ  గత 40 సవంత్సరాలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు చాలిచాలని వేతనాలు తీసుకుంటూ,గ్రామ అభివృద్ధి లో ,ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోసిస్తున్నారని,తెలంగాణ ప్రభుత్వం శ్రమదోపిడికి గురిచేస్తుందని,కార్మిక చట్టాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని,అన్నారు.కనీస వేతనం 18000 ఇవ్వాలని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కరొబార్లను పంచాయితీ కార్యదరిగా నియమించాలని,వారికి ఈ ఎస్ ఐ, పి  ఎఫ్   సౌకర్యం కల్పించాలని, గత సమ్మె కాలపు ఒప్పదలను అమలు చేయాలని డిమాండ్ చేశారు,5 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని,లేని పక్షంలో నిరవధిక సమ్మెలోకి వెల్లుతామని అన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల నర్సయ్య,కరొబార్లు తిరుపతి, పోచాం ,శంకర్,విజయ్,వీరయ్య,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment