Friday, 20 July 2018

గ్రామపంచాయతీ ఉద్యోగులకు కనీస వేతనం ఇవ్వాలి ; ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బన జులై 20 : గ్రామపంచాయతీ ఉద్యోగులును ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్, టిఆర్ఎస్ కొమురంభీం  జిల్లా కార్యదర్శి ఎన్. సుధాకర్ లు అన్నారు. శుక్రవారం  రెబ్బెన లోని అతిథి  గృహ ఆవరణలో మాట్లాడుతూ ఈ నెల 23 న JAC ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె చేయనుంటూతెలిపారు. గత 40 సవంత్సరాలుగా గ్రామ పంచాయతీ ఉద్యోగులు చాలిచాలని వేతనాలు తీసుకుంటూ, గ్రామ అభివృద్ధి లో, ప్రజల అవసరాలు తీర్చడంలో కీలక పాత్ర పోసిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వం శ్రమదోపిడికి గురిచేస్తుందని, కార్మిక చట్టాలను అమలు చేయడంలో విఫలం అయిందని అన్నారు. కార్మికుల కోసం ప్రభుత్వమే ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలని, అన్నారు. కనీస వేతనం 18000 ఇవ్వాలని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కరొబార్లను పంచాయితీ కార్యదరిగా నియమించాలని,వారికి ఈ ఎస్ ఐ, పి  ఎఫ్   సౌకర్యం కల్పించాలని, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయిల నర్సయ్య, తిరుపతి, పోచాం ,శంకర్,విజయ్,వీరయ్య,తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment