కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Wednesday, 30 November 2016
సి ఎస్ పి నిర్మాణ పనులను సకలం లో పూర్తి చేయాలి
సి ఎస్ పి నిర్మాణ పనులను సకలం లో పూర్తి చేయాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సి ఎస్ పి నిర్మాణ పనులను సకలం లో పూర్తి చేయాలి అని సింగరేణి డిరెక్టర్ పీ పీ మనోహర్ రావు అన్నారు ,బుధవారం బెల్లంపల్లి ఏ రియా ను సందర్శించిన అయన సంబంధిత కాంట్రాక్టర్ తో మట్ల దారు .అనంతరం రెబ్బెన సై డింగ్ ను పరిశీలించి ప్రతి రోజు లార్రి ల భోగ్గు సర పర చేస్తున్నారు ఆ న్నే విషయాలను జి ఎం రవిశంకర్ ను అడిగితెలుసుకున్నారు ,ఈ కార్యక్రమంలో యస్ ఓ టు జి ఎం కొండయ్య, డి జి ఎం సివిల్ ప్రసాదరావు, ఎస్టేట్స్ ఆఫీసర్ వారలక్ష్మి, ఇంజనీరు నర్సారెడ్డి తది తరులు పాల్గొన్నారు.
దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
దాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రైతులు తాము పండించిన పంటలను దళారులకు అమ్మి మోసపోకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యాగారాలలో విక్రయించాలని ఆసిఫాబాద్ మార్కెట్ ఛైర్మెన్ అన్నారు రెబ్బెన మండలం కేంద్రం ఇంద్ర నగర్ లోనూతనముగా డి ఆర్ డి ఏ సెర్ఫ్ ల ఆధ్వర్యంలో ధన్య కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అలాగే నంబాల కూడా నూతన ధన్య కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు అనంతరం వారు మాట్లాడుతూ రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు రావాలి అంటే కొనుగోలు కేంద్రాలలో విక్రహించాలని రైతులకు సూచించారు ఈ సమావేశంలో ఆసిఫాబాద్ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ , జెడ్ పి టి సి అజ్మీరా బాపూరావు ,ఎం పి పి సంజీవ్ కుమార్, మార్కెట్ కమిటీ మేనేజర్ వెంకటేష్ సర్పంచ్ పెసరి వెంకటమ్మ , నంబాల సర్పంచ్ గజ్జెల సుశీల ఎం పి టి సి కొవ్వూరి శ్రీనివాస్ ,మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజేశ్వరరావు ,గోలేటి సర్పంచ్ తోట లక్ష్మన్, ఏపీఎం లు వెంకటరమణ, రాజ్ కుమార్, సింగిల్ విండో డైరెక్టర్ మధునయ్య రైతులు పాల్గొన్నారు.
యాసంగి పంటలకు మెళుకువలు పాటించాలి
యాసంగి పంటలకు మెళుకువలు పాటించాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) యాసంగి వరి పంట సాగులలో మంచి విత్తనాలను ఎంచుకొని విత్తన శుద్ధి చేసి మెళకువలు పాటిస్తే పంట దిగుబడులు వస్తాయి అని జిల్లా వ్యవసాయ అధికారి అలీమ్ అహ్మద్ అన్నారు రెబ్బెన మండలంలో రైతు అవగాహనా సదస్సులో అయన మాట్లాడుతూ ఈ వేసవి సాగులో అకాల వడగళ్ల వర్షాలకు రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అలాగే విత్తన కొనుగోలు కేంద్రాలలో మంచి నాణ్యత విత్తనాలను పరిశీలించి తీసుకోవాలి అన్నారు తెలంగాణ ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై విత్తనాలను సరఫరా చేస్తుంది ఆ విత్తనాలను కొనుగోలు చేస్తే అధిక దిగుబడి వస్తది అని అన్నారు అలాగే రైతులు రసాయానిక ఎరువుల లకు బదులుగా సేంద్రియ ఎరువులు వాడితే అధిక ఉత్పత్తి దోహద పడుతుంది అని రైతులకు అవగాహనా కల్పించారు ఈ సమావేశంలో ఏ డి శ్రీనివాస్, డి టి ఎం గురుమూర్తి ,మండల వ్యవసాయ అధికారి మంజుల ,వ్యవసాయ సహాయక అధికారి మార్క్ ,కిష్టాపూర్ సర్పంచ్ భీమేష్ ,మరియు రైతులు పాల్గొన్నారు.
పదవి విరమణ పొందిన అధ్యాపకురాలికి ఘన సన్మానం
పదవి విరమణ పొందిన అధ్యాపకురాలికి ఘన సన్మానం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన జానియర్ కళాశాలలో వృక్షశాస్త్రం అధ్యాపకురాలు కుమారి ఇ ఎల్ శాంత పదవి విరమణ పొందిన అధ్యాపకురాలికి ఘన సన్మానం చేశారు. ఈ సమావేశములో కోమురముభీమ్ అసిఫాబాదు జిల్లా ప్రిన్సిపాళ్లు అందరు హజరైనారు. తరువాత కళాశాల ప్రిన్సిపాల్ కె . వెంకటేశ్వర్ మాట్లాడుతూ వృక్ష శాస్త్ర అధ్యాపకురాలుగా చేసినా విద్యార్థులకు బోధన సులభ మర్గాన వెల్లడించి కళాశాలకు పేరు తెచ్చే రీతిలో బోధించారు అన్నారు . అనంతరం వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు మాట్లాడుతూ ఇన్ని రోజులు రెబ్బెన కళాశాలలో పాఠాలు బోధించి నందుకు చాలా సంతోషంగా వుంది అన్నారు ఈసమావేశంలో రిటార్డ్ ప్రిన్సిపాల్ హరినాథ్,లెక్చరర్ శ్రీదేవి, గంగాధర్ శ్రీనివాస్ ,రామారావు ,ప్రకాష్ ,ప్రవీణ్ ,కళాశాల సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు, విద్యార్థులు, కాలేజ్ లెక్చరర్స్ మరియు లెక్చరర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన జానియర్ కళాశాలలో వృక్షశాస్త్రం అధ్యాపకురాలు కుమారి ఇ ఎల్ శాంత పదవి విరమణ పొందిన అధ్యాపకురాలికి ఘన సన్మానం చేశారు. ఈ సమావేశములో కోమురముభీమ్ అసిఫాబాదు జిల్లా ప్రిన్సిపాళ్లు అందరు హజరైనారు. తరువాత కళాశాల ప్రిన్సిపాల్ కె . వెంకటేశ్వర్ మాట్లాడుతూ వృక్ష శాస్త్ర అధ్యాపకురాలుగా చేసినా విద్యార్థులకు బోధన సులభ మర్గాన వెల్లడించి కళాశాలకు పేరు తెచ్చే రీతిలో బోధించారు అన్నారు . అనంతరం వృక్ష శాస్త్ర అధ్యాపకురాలు మాట్లాడుతూ ఇన్ని రోజులు రెబ్బెన కళాశాలలో పాఠాలు బోధించి నందుకు చాలా సంతోషంగా వుంది అన్నారు ఈసమావేశంలో రిటార్డ్ ప్రిన్సిపాల్ హరినాథ్,లెక్చరర్ శ్రీదేవి, గంగాధర్ శ్రీనివాస్ ,రామారావు ,ప్రకాష్ ,ప్రవీణ్ ,కళాశాల సిబ్బంది మరియు కుటుంబ సభ్యులు, విద్యార్థులు, కాలేజ్ లెక్చరర్స్ మరియు లెక్చరర్స్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
Tuesday, 29 November 2016
భారీ భహిరంగ సభను విజయవంతం చేయండి
భారీ భహిరంగ సభను విజయవంతం చేయండి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నేడు జరిగే భారత కమ్యూనిటీ పార్టీ సిపిఐ భారీ భహిరంగ సభను విజయవంతం చేయాలని ఏ ఐ టి సి జిల్లా కార్యదర్శి బోగె ఉపేందర్ కోశాధికారి రాయిల్ల నర్సయ్య లు పిలుపునిచ్చారు వారు మాట్లాడాతు భారత దేశంలో సుధీర్ఘ రాజకీయ చరిత్రగలపార్టీ భారత కమ్యూనిటీ పార్టీయే అని దేష స్వతంత్రం కోసం ఎన్నో త్యాగాలు చేస్తూ ప్రజా శ్రేయస్సు కోరే పార్టీ అన్నారు తెలంగాణ రాష్త్ర సాధన కోసం ఖీలక పాత్ర పోషించింది అన్నారు హనుమకొండలో ప్రభుత్వ జూనియర్ కళాశాలగ్రౌండ్ లో భారీ భహిరంగ సభకు అధిక సంఖ్యలో విచ్చేసి జయప్రదం చేయాలని కోరారు.
ఆసుపత్రి సదుపాయాల కొరకు సమీక్ష
ఆసుపత్రి సదుపాయాల కొరకు సమీక్ష
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ఆసుపత్రి సదుపాయాల కొరకు మంగళవారం ప్రజాప్రతినిధులు ఆసుపత్రి సిబ్బంది సమావేశం ఏర్పడి మౌళిక సదుపాయాల కొరకు చర్చించారు . ఈ సందర్బంగా డాక్టర్ సంతోష్ సింగ్ మాట్లాడుతు ఆసుపత్రిలో సదుపాయాల కోసం నిధులు 1 లక్షా 7500 వేలు ఉన్నాయి మరింత సదపాయాల కోసం 3 లక్షల వేయం అవసరం ఉందని అందుచే ఆయన సొంత జీతభత్యాలతో 50వేల రూపాయలు అభివృద్ధి కొరకు ఇచ్చారు. ఎంపిపి సంజీవ్ కుమార్ మాట్లాడుతు ఆసుపత్రిలో మౌళిక సదుపాయాల కోసం మా నిధుల నుంచి అలాగే ప్రజా ప్రతినిధులు కలసి 1లక్షా 50వేలు సేకరించి వైద్య సదుపాయాన్ని మరింతగా పెంచి మండల ప్రజలకు ఉపయోగ పడేల ఆసుపత్రిని తీర్చిదిద్దుదాం అన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి బాబురావు, ఎంపిడిఓ సత్యనారాయణ సింగ్, మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ, వైస్ ఎంపిపి రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, మండల్ సర్పంచులు ,ఎంపిటిసిలు, తదితరులు పాల్గొన్నారు.
కె సి ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కె సి ఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) తెలంగాణ సాధించడానికి దీక్షాదివాస్ చేపట్టిన రోజు ఎనిమిదవ సంవత్సరం సందర్బంగా రెబ్బెన అతిధి గృహంలో మంగళవారం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. ఎం పి పి సంజీవ్ కుమార్, జెడ్ పి టి సి బాబురావు, మార్కెట్ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ, వైస్ ఎంపిపి రేణుక, సర్పంచ్ పెసర వెంకటమ్మ, ఉప సర్పంచ్ శ్రీధర్, శ్రీధర్ రెడ్డి, అశోక్, నవీన్, చిరంజీవి, సోమశేఖర్, సుదర్శన్ గౌడ్, రాజేశ్వర్, మధునయ్య, వెంకన్న గౌడ్, చోటు, తదితరులు ఉన్నారు అలాగే గోలేటిలో గ్రామంలో కూడా తెరాస నాయకులు మలరాజ్ శ్రీనివాస్ రావు ,శ్రీనివాస్ రెడ్డి ,నర్సింగరావు ,శంకరయ్య లు చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుంది:శరత్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ఎస్సీ వర్గీకరణ జరిగి తీరుతుందని దానికి అందరు సహకరించాలని ఎమ్.ఆర్.పి.ఎస్ జిల్లా అధ్యక్షుడు శరత్ అన్నారు.రెబ్బెన అతిధి గృహంలో మంగళవారంనాడు ఎమ్.ఆర్.పి.ఎస్ నాయకులూ ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా అధ్యక్షుడు శరత్ హాజరై మాట్లాడుతు ఆదివారం నిర్వహించిన ధర్మ యుద్ధ బహిరంగ సభ కు హాజరయ్యి విజయవంతం చేసిన నాయకులకు,కులస్థులకు కృతజ్ఞతలు తెలియజేశారు.ఎట్టి పరిస్థితిల్లొనైనా ఎస్సీ వర్గీకరణ జరిగితీరుతుందని అయన అన్నారు.ఈ కార్యక్రమంలో ఎం ఆర్ పి ఎస్ నాయకులూ లింగంపల్లి ప్రభాకర్,అరికెల్ల మొగిలి,గోగర్ల రాజేష్,చిలుముల నర్సింగం,బొంగు నర్సింగరావు,తదితరులు పాల్గొన్నారు.
Monday, 28 November 2016
గ్రామాల అభివృద్ధి కి నిధులు కేటాయించండి
గ్రామాల అభివృద్ధి కి నిధులు కేటాయించండి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన మండల సర్వసభ్యసమావేశం సోమవారంనాడు ఎంపిపి కార్నాథం సంజీవకుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లో పలువురు ప్రజాప్రతినిధులు సమస్యల ఫై అధికారులను ప్రశ్నించారు. సభ్యులు మాట్లాడుతూ సమయానికి నిధులు రాక గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుందని అన్నారు.అలాగే రెబ్బెన ప్రభుత్వ హాస్పిటల్ లో అధనంగా మరో డాక్టర్ ను ,నియమించాలని కోరారు.ఉపాధి హామీ పధకం చెల్లింపులో జాప్యం జరుగుతుందని,ఇంకుడుగుంతలు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రాక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.బిసి, మైనారిటీ కమ్యూనిటీ భవనాలకు నిధులు, భూస్థలాలు కేటాయించాలని అన్నారు నేర్పాల్లి లో గత వేసవి లో నీళ్లు సప్లై చేసిన వారికీ బిల్లులు చెల్లించాలని అడిగారు..మండలంలో కొంతమంది ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదని వారి ఫై చర్యలు తీసుకోవాలని,ఉపాధ్యాయులు సమయపాలన పాటించే విదంగా చర్యలు చేపట్టాలని కోరారు.అధికారులు ఎవరు అందుబాటు లో ఉండడం లేదని, అందరూ ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉండాలని అన్నారు. అజడ్పీటీసీ ఆజ్మేర.బాబురావు మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా ను అరికట్టాలని అన్నారు.వచ్చే సీజన్లో లో టేకు మొక్కలు నాటేందుకు గాను సిదంగా ఉన్నాయని అధికారి అన్నారు.ఈ సమావేశం లో తహసీల్ధార్ బండారి రమేష్ గౌడ్,ఎంపీడీఓ సత్యనారాయణసింగ్ ,ఈఓ.పిఆర్డి.కిరణ్,ఏపీఎం లు వెంకటరమణ,రాజ్ కుమార్,సీడీపీఓ మమత, ఆర్ డబ్ల్యు ఎస్ జెఇ , పిఆర్.జెఇ. , ఎంపీటీసీసభ్యులు కొవ్వూరి.శ్రీనివాస్, మద్దెల.సురేందర్, సర్పంచ్ లు పెసారు వెంకటమ్మ,గజ్ఝేల సుశీల,భీమేష్,తోట లక్ష్మణ్,రావోతుల పద్మ,రవీందర్ మండల అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చిన గోలేటి మహిళలు
యోగా పోటీల్లో ప్రతిభ కనబర్చిన గోలేటి మహిళలు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలం లోని గోలేటికి చెందిన మహిళలు యోగా పొటిలలో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు యోగా మాస్టర్ రెవెల్లి రాయలింగు తెలిపారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ ఉషోదయ పాఠశాలలో సోమవారం యోగా అసొసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగా పోటీల్లో కుమ్రం భీం జిల్లా లోని గోలేటికి చెందిన దేవేంద్ర 40-50 వయస్సు కేటగిరిలో బంగారు పతకం, కొండు లత ద్వితీయ స్థానాన్ని కైవాసం చేసుకోగా, మూడవ స్థానాన్ని పత్త0 అలెఖ్య దక్కించుకుంది. గతంలో వీరు కోల్కత్తాలో నిర్వహించిన యోగా శిబిరాల్లో సైతం తెలంగాణ రాష్ట్రం తరుపున పాల్గొని బహుమతులు సాధించినట్లు తెలిపారు.
Sunday, 27 November 2016
అక్రమ ఇసుకకు చెక్
అక్రమ ఇసుకకు చెక్
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బన మండలం లో అక్రమ ఇసుక రవాణా రాత్రి పగలు కొనసాగుతున్న తరుణంలో కొమురం భీం జిల్లా పాలనా అధికారి చంపక్ లాల్ ఆదేశాల మేరకు ఆదివారం తాసిల్దారు రమేష్ గౌడ్ సమక్షంలో గొల్లగూడ లక్ష్మీపూర్ , కొండపెల్లి, గోలేటి ఎక్స్ రోడ్ లా వద్ద చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసారు. ఈ సందర్బంగా తాసిల్దార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ అక్రమ ఇసుక రవాణా అరికట్టడం కోసం ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు చెక్ పోస్ట్ నిర్వహించటం జరిగింది అన్నారు. కార్యాలయం సిబ్బంది రాత్రి పగలు దశల వారీగా డ్యూటీ లను కొనసాగిస్తూ అక్రమ ఇసుకను అరికడతామన్నారు.ఇక మేరకు ఎటువంటి అనుమతి పత్రాలు లేకుండా ఇసుకను రవాణా చేసినచో చట్ట రీత్యా చెర్యలు తీసుకుంటామన్నారు. వీరితో పటు కార్యాలయం సిబ్బంది ఉమ్ లాల్ నాందేవ్ బాపు విట్టల్ చంద్రయ్య తదితరులు వున్నారు.
Saturday, 26 November 2016
ఏఐటీయూసీ కొమురంభీం అసిఫాబాద్ జిల్లా కమిటి ఎన్నిక
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) జిల్లాల పునర్విభజన లో భాగంగా మంచిర్యాలలో జరిగిన ఏఐటీయూసీ జిల్లా నిర్మాణ మహాసభలలో కొమురంభీం జిల్లా కమిట ఎన్నుకోవడం జరిగిందని జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన ఎస్.తిరుపతి తెలిపారు.జిల్లా అధ్యక్షుడిగా ఎస్.తిరుపతి, ఉపాధ్యక్షుడిగా బయ్యా మొగిలి, ప్రధాన కార్యదర్శిగ కాగజ్ నగర్ కు చెందిన అంబాలా ఓదెలు,సహాయ కార్యదర్శి గ బోగే ఉపేందర్, కోశాధికారిగా రాయిల్ల నర్సయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఎన్నికైన వారు మాట్లాడుతూ అసంఘటిత కార్మిక వర్గం సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తామ, కాంట్రాక్టు కార్మికుల పై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని,సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న కార్మిక వర్గంఫై ప్రభుత్వం కేసులు పెడుతుందని వారు అన్నారు.జిల్లాలో ఏఐటీయూసీ ని బలోపేతం చేస్తామని,అన్ని మండలలో ఏఐటీయూసీ కమిటీ లు ఏర్పాటు చేస్తామని అన్నారు.
షరతులు లేని వారసత్వ ఉద్యోగాలు కల్పించాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) ముఖ్య మంత్రి కే సి ఆర్ ఎన్నికల సమయం లో కార్మికులకు ఇచ్చిన హామీల ప్రకారం ఎలాంటి షరతులు లేకుండా అందరికి వారసత్వ ఉద్యోగాలు కల్పించాలని కార్మికుల బిడ్డల సంఘం నాయకులు ఫర్వేజ్,రవీందర్ ,తిరుపతులు అన్నారు .రెబ్బెన మండలంలోని గోలేటి బస్సు ప్రాంగణం లో శనివారం నాడు మంచిర్యాలలో జరిగే సింగరేణి కార్మికవారసుల సమావేశానికి సంభందించిన గోడప్రతులు విడుదల చేసారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నిక ల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఒక్క సంవత్సరం సర్వీస్ నిబంధన వలన రెండువేల ఆరువందల కార్మిక కుటుంబాలు రోడ్డున పడే ప్రమాదం ఉందని,తెలంగాణ ఉద్యమ సమయం లో సకల జనుల సమ్మె లో ప్రతిఒక్క కార్మికులు పాల్గొన్నప్పటికీ ఈ షరతులు ఎందుకన్నారు . మంచిర్యాలలో జరిగే కార్మికుల వారసుల భహిరంగ సభకు కార్మికులు వారి పిల్లలు మరియు ప్రజా ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయ వంతం చేయాలనీ కోరారు ఈ సమావేశమం లో రంజిత్ , అశోక్ ,తిరుపతి , సమీర్, సతిష్ ,తదితరులు పాల్గొన్నారు .
Tuesday, 22 November 2016
బొగ్గు లారీ ల రవాణాను అడ్డుకున్న రైల్వే అధికారులు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి బొగ్గును రెబ్బెన యార్డ్ కు తరలిస్తున్న బొగ్గు లారీలకు అనుమతి లేదని రైల్వే అధికారులు మంగళవారం నాడు సి హెచ్ పి వద్ద ఉన్నటువంటి రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి దారిని మూసివేయడం జరిగింది.గతం లో ఈ మార్గం ద్వారానే రవాణా కొనసాగిస్తుండగ రైల్వే నూతన అధికారులు రైల్వే అండర్ బ్రిడ్జి నుంచి ప్రయాణించే అనుమతి లారీ లకు లేదని బండరాళ్లు,ఇనుప రైలు పట్టాలతో దారిని మూసివేశారు. దీనితో లారీ లు రెబ్బెన సమీపం లో నంబాల వెళ్లే దారి లో ఉన్నటువంటి రైల్వే గేట్ నుండి వెళ్తున్నాయి,దీని వల్ల రోడ్ కు ఇరువైపులా లారీ ఆగడం తో ఆ మార్గం వెళ్లే వివిధ గ్రామాల ప్రజలు ఇబ్బంధులపడుతున్నామని అన్నారు.
ఒప్పంద అధ్యాపకులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన
ఒప్పంద అధ్యాపకులు నల్ల బ్యాడ్జ్ లు ధరించి నిరసన
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన ప్రభుత్వ జూనియర్ కళాశాల లోతమ సమస్యలు పరిష్కరించాలని మంగళ వారం నాడు ఒప్పంద అధ్యాపకులు నల్ల బ్యాడ్జ్ లు దరించి నిరసన తెలిపారు.అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ జి.వెంకటేశ్వర్ కు వినతి పత్రం సమర్పించారు. ఒప్పంద అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వo ఎన్నికల సందర్భాంగ మేనిపేస్ట్లోలో ప్రకటించిన విదంగా వెంటనే తమని క్రమబద్ధికరణ చేయాలని డిమాండ్ చేసారు.ఒక వేల క్రమబధీకరణ ఆలస్యమైనాచో వెంటనే పదోవ వేతన ఒప్పంద అమలు ప్రకారం ములవేతనము మరియు డీఏ చెల్లించే విదంగా చేర్యలు తీసుకోవాలని ఈ నెల 23న ఇంటర్ మెడియటే కమీషనర్ తో జరిగే సమావేశం లో ను చర్చించాలని ప్రిన్సిపాల్ ను కోరారు.ఈ కార్యక్రమం లో అధ్యాపకులుబి.గంగాధర్,జి.ప్రవీణ్,ప్రకాష్,జి.ప్రకాష్,వెంకటేష్,రామారావు,అమరెందెర్,నిర్మల,సుమలత,దీప్తి,ఝాన్సీ,మంజుల,పద్మ,మల్లేశ్వరి పాల్గొన్నారు.
డీఆర్ డీఏ సెర్ప్ సమీక్షా సమావేశం
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) రెబ్బెన గౌతమి మండల సమీఖ్య సమావేశము మంగళవారం డి ఆర్ డి ఏ కార్యాలయం లో నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిదులుగా ఏరియా కోఆర్డినేటర్ అన్నాజీ ,రాజ్కుమార్ ,ఏపీఎం పాల్గొన్నారు . ఈ సమావేశంలో తెలంగాణ పల్లె ప్రగతి ప్రాజెక్టు అమలు లింకేజీ రుణాలు శ్రీనిధి రుణాలు ,స్వయం సహాయక సంఘాల మరియు గ్రామ సంఘాల పని తీరు పుస్తక నిర్వహణ ఆన్లైన్ రిపోర్ట్ నమోదు చేయడానికి ఎస్ సి ,ఎస్ టి సబ్ప్లాన్ అమలు విధానం ఫై సమీక్షా సమావేశం నిర్వహించడం జారిగింది స్వయం సహాయక సంఘాలలోని పేద మహిళల అభివృద్ధికి కృషి చేయాలనీ సంఖ్య సభ్యులకి మరియు సిబ్బందికి సూచించారు ఈ సమావేశం లో ఏపీఎం లు చంద్ర శేఖర్ ,నాగ జ్యోతి ,డిఎంజి రాజ్కుమార్ మరియు సి సి లు , గ్రామా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.
రెబ్బెనలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
రెబ్బెనలో ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) ప్రపంచ మత్స్య కారుల దినోత్సవాన్ని పునస్కరించుకొని సోమావారం రెబ్బెనలోని అతిథి అవరంణంలో గ్రామా మత్స్యకారుల సంఘ అధ్యక్షడు పేసరి మధునయ్య ముదిరాజ్ అధ్యక్షతలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాలుగు జిల్లాల ప్రధాన కార్య దర్శి నీలం సంపత్ కుమార్ ముదిరాజ్ హాజరై మాట్లాడారు ముదిరాజ్ కుటుంబాలకు శుభాకాంక్షలు తెలిపి కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం మాట్లాడుతూ డిసెంబర్ రెండు నుండి పద్దెనిమిది వరకు కొనసాగే మహాపాద యాత్ర ని ముదిరాజ్ భందువులంతా విజయవంతం చేయలని కోరారు . ఈ మహా పాద యాత్ర ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు జరుగుతుంద్దన్నారు, బిసి డి లోంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేసారు ప్రభుత్వం ఇకనైనా మదిరాజ్ లను గుర్తించి ప్రభుత్వ ప్రయోజనాలను అందేలా చూడాలని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో రెబ్బెన సర్పంచ్ పెసర వెంకట్టమ్మ ముదిరాజ్ , కొమరంభీం జిల్లా ముదిరాజ్ కన్వీనర్ తోట లక్ష్మణ్ ముదిరాజ్ ,మంచిర్యాల జిల్లముదిరాజ్ సంఘ ప్రధాన కార్యదర్ద్షి పేట మల్లయ్య నాయకులు ,పేట మల్లయ్య ,మండలా అధ్యక్షులు శరత్ ముదిరాజ్,సంగం నాయకులు పోతురెడ్డి రమేష్ , తీగల శ్రీనివాస్ ,అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ,అంకం సందీప్,మూడెడ్ల రమేష్ ,ఎర్రం మల్లేష్ ,మొగిలి ,శివకుమార్ ,రాజన్న ,వెంకటేశం, తదితరులు పాల్గొన్నరు.
ఢిల్లీ కి తరలిన ఏ.ఐఎస్.ఎఫ్ నాయకులూ
ఢిల్లీ కి తరలిన ఏ.ఐఎస్.ఎఫ్ నాయకులూ
కొమురం బీమ్ ( రెబ్బెన వుదయం ప్రతినిధి) విద్యా,ఉపాధి అవకాశాలు కల్పించాలని,గిరిజనులు ఆదివాసులు ముస్లింలపై దాడులను అరికట్టాలని,దేశ వ్యాప్తంగా అందరికీ సమాన విద్యా మరియు ఉచిత విద్యా అందించాలని ఏ.ఐఎస్.ఎఫ్ ఆద్వర్యంలో రేపు జరిగే పార్లమెంట్ మార్చ్ కు తరలివెళ్ళిన ఏ.ఐఎస్.ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దుర్గం రవీందర్, జిల్లా కార్యవర్గ సభ్యులు కస్తూరి రవి,డివిజన్ అధ్యక్షుడు వికాస్,నాయకులు అజయ్,విలాస్,వేంకటేష్ తదితరాలు ఉన్నారు.
Saturday, 19 November 2016
కార్మికుల హక్కులను కాపాడేది ఏఐటీయూసీ ఒక్కటే :వాసిరెడ్డి సీతరామయ్య
కార్మికుల హక్కులను కాపాడేది ఏఐటీయూసీ ఒక్కటే :వాసిరెడ్డి సీతరామయ్య
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి కార్మికుల హక్కులను సాధించి,హక్కులను కాపాడే సంఘం ఏఐటీయూసీ ఒక్కటే అని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ప్రధాన కార్యాదర్శి వాసిరెడ్డి సీతారామయ్య అన్నారు. శనివారం నాడు రెబ్బెన మండలం గోలేటి ఏరియా కైరిగూడ ఓపెన్ కాస్ట్ లో నిర్వహించిన ద్వారా సమావేశం లో పాల్గొని ఆయన మాట్లాడుతూ సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ నిరంతరం పోరాటం నిర్వహిస్తుందని అన్నారు. గత రెండు నెలల క్రితం నిర్వహించిన పోరు యాత్ర ఫలితంగానే సింగరేణి కార్మికుల కు సకలజనుల సమ్మె కాలపు వేతనాలు విడుదల అయినవని ,రాష్ట్ర ప్రభుత్వం,యాజమాన్య విధానాల వల్ల అందరికార్మికులకు సమ్మె కాలపు వేతనాలు అందక పోవడం బాధాకరం అని అన్నారు. సకల జనుల సమ్మెకాలపు వేతనాలు అందరి కార్మికులకు ఇప్పించడం లో గుర్తింపు సంఘం అయిన టిబిజికేఎస్ పూర్తిగ విఫలం అయిందని అన్నారు.సింగరేణి లో వారసత్వ ఉద్యోగాలకు చట్టబద్ధత కల్పించాలని,ఆర్ ఎల్ సి సమక్షంలో ఒప్పందం చేసుకోవాలని అన్నారు. లేని పక్షం లో బోర్డు అఫ్ డైరెక్టర్స్ సమావేశం లో దినిని రద్దు చేసే అవకాశం ఉంటుంది దీనివల్ల కార్మికులకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చిన హామీ ప్రకారం షరతులు లేని వారసత్వఉద్యోగాలను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.గతం లో టిబిజికెఎస్ లో ఉన్న గ్రూప్ తగాదాల వల్ల వాళ్లు వాళ్ళు కొట్టుకోవడమే సరిపోయిందని కార్మికులకు చేసింది శూన్యం అని అన్నారు. ఆ రెండు గ్రూపు లు చాలవు అన్నట్టు గ మూడో గ్రూపు వెంకట్రావ్ వర్గం వచ్చి చేరిందని అన్నారు.టిబిజికెఎస్ కార్మికుల సమస్యలు పరిష్కరించకపొగ జైలు పాలయ్యి కోర్టు ల చుట్టూ తిరుగుతూ నాలుగు సంవత్సరాల కాలాన్నీ వృధా చేసి కార్మిక వర్గానికి తీరని అన్యాయం చేసిందని అన్నారు.ఏఐటీయూసీ నిర్వహించిన పోరుయాత్ర ఫలితంగానే వారసత్వ ఉద్యోగాల ప్రకటన జరిగిందని అన్నారు. నిరంతరం కార్మికులసమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏఐటీయూసీ ని కార్మికులు ఆదరించాలని ఆయన కోరారు. ఏఐటీయూసీ కి ఆకర్షితులై ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ లోని ఈపి ఆపరేటర్ కార్మికులు 30 మంది సంఘం లో చేరడం జరిగింది. వారికీ వాసిరెడ్డి సీతారామయ్య కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ సమావేశం లో ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి ఎస్.తిరుపతి,ఉపాధ్యక్షులు బయ్యా మొగిలి,ఆర్గనైజింగ్ కార్యదర్శులు బి.జగ్గయ్య,సోకాలశ్రీనివాస్,.శివరావు,శేషసేయణరావు [శేషు]ఫిట్ కార్యదర్శి డి.ఈశ్వర్ రెడ్డి, అసిస్టెంట్ కార్యదర్శి దివాకర్,షిఫ్ట్ ఇంచార్జి లు జూపాక రాజేష్,చంద్రశేఖర్,ఏంఆర్.చారీ, సత్యనారాయణ,నాయకులు కిరణ్,ఎం.సత్యనారాయణ,జాడి స్వామీ,పూదరిసాయికిరణ్,కార్మికులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ లో చేరిన కార్మికు ఎన్.నరేష్,పరంధామయ్య,ఎస్.రమేష్,సి.లింగయ్య,గజ్జెల.శ్రీనివాస్,ఎ.శ్రీనివాస్ రెడ్డి,జె.మహేందర్,పీ.వెంకటేష్,జె.లక్ష్మణ్,కె.పోచం,జి.మల్లయ్య,నవీన్,బందం రమేష్, పలువురు కార్మికులు చేరడం జరిగింది.
ఘనముగా ముగిసిన 49 వ గ్రంధాలయ వారోత్సవాలు
ఘనముగా ముగిసిన 49 వ గ్రంధాలయ వారోత్సవాలు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) 49 వ వారోత్సవాలను పురస్కరించుకుని రెబ్బెన శాఖా గ్రంథాలయంలో శనివారం విద్యార్థులకు ఆయా పోటీలు నిర్వహించారు. వారోత్సవాలన చివరిరోజున లైబ్రేరియన్ పాలకుర్తి స్వర్ణలత గౌడ్ ప్రభుత్వ, ప్రయివేట్ పాఠశాలల విద్యార్థులకు వ్యాస రచన, ఉపన్యాస, చిత్రలేఖన పోటీలను జరిపారు. గెలుపొందిన విద్యార్హులకు బహుమతులను అందజేశారు. రెబ్బెన :గ్రంథాలయంలో పఠనం చేసుకొని గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని ముఖ్య అతిథి గ విచ్చేసిన ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కుందారపు శంకరమ్మ మాట్లాడారు నిత్యం పుస్తకాలను,పత్రికలను చదు వుతూ ఉంటే కొత్త కొత్త విషయాలు తెలుస్తాయని తెలిపారు ముఖ్యముగా యువతకు ఉద్యోగాలు అవకాశాలతో పాటు పుస్తకాల పఠానం వల్ల మేధ శక్తి ని పెపొందించుకోవచ్చు అని అన్నారు గ్రంథాలయాల్లో ప్రముఖుల శాస్త్రవేత్తల జీవిత చరిత్రలు పుస్తకాలు దొరుకుతాయి అవి చదివి మహాను బావుల ఆదర్శముగా తీసుకోని ముందుకుసాగాలి అని తెలియచేశారు ఈ సంధర్భంగా వారం రోజుల పాటు నిర్వహించిన పలు కార్యక్రమాల్లో పాల్గొని ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో తెరాస నాయకులూ అన్నపూర్ణ .శాంతికుమార్ గౌడ్ , ప్రభాకర్, ఉపాద్యులు శ్రీనివాస్ ఖాదర్, సత్యం, అమీర్ ఉస్మాని, సోమశేఖర్ ,గ్రామప్రజలు విద్యార్థులు పాల్గొన్నారు.
Friday, 18 November 2016
టి బి జి ఎస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పలు సంఘాల కార్మికుల చేరిక
టి బి జి ఎస్ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పలు సంఘాల కార్మికుల చేరిక
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) బెల్లంపల్లి ఏరియా లోని వివిధ గనులపై టి బి జి కే ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్షి మిర్యాల రాజిరెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. కైరుగూడ ,గోలేటి 1 వర్కుషాప్ వద్ద నున్న కార్మికులతో ద్వారసమాచారాలంలో ప్రసంగించారు . మరియు పలు యూనియన్ లకు సంభందించిన కార్మికులను టి బి జి కే ఎస్ కండువాలు కప్పి కార్మికులను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ సకలజనులసమ్మె కాలంలో సింగరేణి కార్మికులు పూర్తి సమ్మతి తెలిపారని. 18 సం" క్రితం పలు యూనియన్లు పోగొట్టిన వారసత్వ ఉద్యోగాలను బోర్డు మిటింగులో సంపాదించినా ఘనత రాష్త్ర ముఖ్యమంత్రిగారికే చెందుతుందని అన్నారు . మరియు కొన్ని ప్రతిపక్ష కార్మిక యూనియన్లు కావాలనే వి ఆర్ ఎస్ , డిస్స్మిస్ , షరతులతో కూడుకున్న వారసత్వ ఉద్యోగాల పై ప్రాపగాండా చేసినప్పటికీ నష్టపోయిన కార్మికుల 2600 మందికి పూర్తి న్యాయం చేసేందుకు ప్రయత్నించామని,కానీ చట్ట పరమైన కొన్ని నిభందనలు వారికీ వర్తించలేదని అన్నారు . ఈ సాందర్బంగా150 మంది కార్మికులు , ఫిట్ కార్యదర్శులు వివిధ యూనియన్ల నుండి టి బి జి కె ఎస్ లో కలిశారు . రామ్మూర్తి , నూనెకొమురయ్య వొడ్డెపల్లి ఓదెలు రవీందర్ ఎం. శ్రీనివాసరావు భైరి శంకర్ రాంరెడ్డి యాదగిరి సంపత్ మరియు తదితరులు పాల్గున్నారు.
ముదిరాజ్ల ఫై చిన్న చూపు తగదు - శ్రీనివాస్ ముదిరాజ్
ముదిరాజ్ల ఫై చిన్న చూపు తగదు - శ్రీనివాస్ ముదిరాజ్
కొమురం బీమ్ (వుదయం ప్రతినిధి) ముదిరాజ్ ఫై పాలక వర్గం చిన్నచూపు చూస్తూ ప్రభుత్వం వివక్షత చూపుతుందని తెలంగాణ ముదిరాజ్ రాష్ట్ర నేత గుండ్లపల్లి శ్రీనివాస్ అన్నారు , శుక్రవారం రెబ్బెనలో ఏర్పాటు చేసిన ముదిరాజ్ సమావేశం లో మాడ్లాడుతు డిసెంబర్ రెండు నుండి పద్దెనిమిది వరకు కొనసాగే మహాపాద యాత్ర ని విజయవంతం చేయలని పిలుపునిచ్చారు ఈ మహా పాద యాత్ర ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ వరకు జరుగుతుంద్దన్నారు ,ఈ సందర్బంగా మహాపాదయాత్ర పోస్టర్ లను ఆవిష్క రించారు ఈ సమావేశంలో జిల్లా కన్వీనర్ తోట లక్ష్మణ్ ముదిరాజ్ కో కన్వీనర్ పెసరి మధునయ్య, ముదిరాజ్ అద్వర్యం లో నిర్వహించిన సమావేశంలో నాయకులు మాట్లాడుతూ బిసి డి లోంచి బీసీ ఏ లోకి మార్చాలని డిమాండ్ చేసారు ప్రభుత్వం ఇకనైనా మదిరాజ్ లను గుర్తించి ప్రభుత్వ ప్రయోజనాలను అందేలా చూడాలని అన్నారు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. ముదిరాజ్ ల కులవృత్తికై ప్రభుత్వం అమలు చేసే ఫలాలను అర్హులైన వారికీ అందించి వారి పురొఅభివృద్ధికి దోయత పడాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘ మహాసభ నాయకులు ,పేట మల్లయ్య ,మండలా అధ్యక్షులు శరత్ ముదిరాజ్,సంగం నాయకులు తీగల శ్రీనివాస్ ,అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ,అంకం సందీప్,పోతురెడ్డి రమేష్ ,మూడెడ్ల రమేష్ ,తదితరులు పాల్గొన్నరు.
విద్యార్థులకు మాక్ పోలింగ్ గురించి అవగహన
విద్యార్థులకు మాక్ పోలింగ్ గురించి అవగహన
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన లోని జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో శుక్ర వారం విద్యార్థులకు ప్రజాస్వామ్య పద్ధతిలో మాక్ ఎన్నికలు హెడ్ మాస్టర్ స్వర్ణలత అద్వర్యం లో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఎంపీపీ సంజీవ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై పోలింగ్ కేంద్రాన్ని ప్రారంభించారు. భారత ఎన్నికల సంఘం అమలు చేస్తున్న ఎన్నికల ప్రక్రియను విద్యార్థులకు వివరిస్తూ బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు చేపట్టారు. ఈ మేరకు ఎన్నికల నోటిఫికేషన్ దరఖాస్తుల స్వీకరణ, ఉపసంహరణ, స్క్రుటిని, పోటీ చేసే అభ్యర్థుల ప్రచారం, ఓటింగ్ ప్రక్రియపై విద్యార్థులకు అవగాహన కల్పించిన అనంతరం అభ్యర్థుల గుర్తులతో కూడిన బ్యాలెట్, చూపుడు వేలుకు సిరా అంటించడం, నచ్చిన అభ్యర్థికి ఓటు వేసి బ్యాలెట్ బాక్సుల్లో వేసే ప్రక్రియను నిర్వహించి విజేతలను ప్రకటించారు. ఈ సందర్బంగా ఎంపీపీ సంజీవ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే ప్రజస్వామ్య పద్దతిలో ఓటు పోలింగ్ అవగాహన ఎంతో అవసరమని రానున్న రోజుల్లో ఓటు వేయడానికి ఎంతో దోహత పడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ పెసర వెంకటమ్మ ,ఉపసర్పంచ్ బొంబినేని శ్రీధర్ కుమార్ , వార్డ్ సభ్యులు మడ్డి శ్రీనివాస్ ,కమిటీ సభ్యులు భేమేష్ ఉపాధ్యాయులు ,విద్యార్థులు , తదితరులు పాల్గొన్నారు.
Thursday, 17 November 2016
గోలేటిలో హాకీ పోటీలు
గోలేటిలో హాకీ పోటీలు
ఉన్ని దుస్తులు పంపిణి
ఉన్ని దుస్తులు పంపిణి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములోని పులికుంట ప్రభుత్వ పాఠశాలలో రెబ్బెనకు చెందిన బియ్యం వ్యాపారి యోగేష్ విద్యార్థులకు ఉన్ని దుస్తులను గురువారం పంపిణి చేశారు . ఈ కార్య క్రమములో ఎహ్ ఎం శ్రీనివాస్ , ఉపాద్యాయుడు శ్రీనివాస్ గౌడ్ , వార్డు మెంబర్ ఇప్ప పోశం , పాఠశాల ఛైర్మెన్ పోశం , నాయకులు పోషమల్లు , భీమయ్య , సుధాకర్ ఉన్నారు.
ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం
ఎస్ వి ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన లోని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం నాడు నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా విద్యా బోధన చేశారు . ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా రెబ్బెన ఉన్నత పాఠశాల ప్రధానోపాస్యాయురాలు స్వర్ణలత పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చిన్న ప్పటినుండి క్రమశిక్షతో కూడిన విద్యను నేర్చుకోవాలని అన్నారు . ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చి దిద్దాలన్నారు . విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు . స్వయం పరిపాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమములో రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , ఉన్నత పాఠాశాలఉపాద్యాయులు సీమ , విజయ లక్ష్మి , పాఠశాల కరస్పాండెంట్ దీకొండ విజయ కుమారి , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీకొండ సంజీవ్ కుమార్ , టి ఆర్ ఎస్ నాయకులు సచిన్ ఉపాధ్యాయులు , విద్యార్థులు ఉన్నారు .
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన లోని ఎస్ వి ఇంగ్లిష్ మీడియం హై స్కూల్ లో స్వయం పరిపాలన దినోత్సవం సందర్భంగా గురువారం నాడు నిర్వహించారు. విద్యార్థులే ఉపాధ్యాయులుగా విద్యా బోధన చేశారు . ఈ కార్య క్రమానికి ముఖ్య అతిథిగా రెబ్బెన ఉన్నత పాఠశాల ప్రధానోపాస్యాయురాలు స్వర్ణలత పాల్గొని మాట్లాడారు . విద్యార్థులు చిన్న ప్పటినుండి క్రమశిక్షతో కూడిన విద్యను నేర్చుకోవాలని అన్నారు . ఉపాధ్యాయులు విద్యార్థులను అన్ని రంగాలలో తీర్చి దిద్దాలన్నారు . విద్యార్థులకు క్రీడలు కూడా ఎంతో ముఖ్యమని తెలిపారు . స్వయం పరిపాలన దినోత్సవంలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు . ఈ కార్యక్రమములో రెబ్బెన ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధర్ , ఉన్నత పాఠాశాలఉపాద్యాయులు సీమ , విజయ లక్ష్మి , పాఠశాల కరస్పాండెంట్ దీకొండ విజయ కుమారి , పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దీకొండ సంజీవ్ కుమార్ , టి ఆర్ ఎస్ నాయకులు సచిన్ ఉపాధ్యాయులు , విద్యార్థులు ఉన్నారు .
హాస్టల్లో దోమల పిచ్చుకారి మందు
హాస్టల్లో దోమల పిచ్చుకారి మందు
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహం లో దోమ నివారణ పిచికారీ మందును జల్లారు. డాక్టర్ సంతోష్ సింగ్ ఠాగూర్ మాట్లాడుతూ వాతావరణ మార్పువల్ల వ్యాధులు వచ్ఛే ప్రమాదం ఉందని అప్రమత్తంగా ఉండాలని తెలిపారు . చుట్టూ ప్రదేశాలలో నీరు నిలువకుండ చూడాలని పేర్కొన్నారు . నీరు నిల్చున్న స్థలాల్లో దోమల వృద్ధిచెందుతాయని అన్నారు.
Wednesday, 16 November 2016
విద్య ఉపాధి అవకాశాలను కలిప్పిండం లో భాజపా ప్రభుత్వం విఫలం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) దేశ ప్రజలకు,విద్యార్థులకు,నిరుద్యోగ యువత కు కేంద్ర ప్రభుత్వం చేసింది ఏమి లేదని ఏ ఐ వై ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపేందర్,ఏ ఐ ఎస్ ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దుర్గం రవీందర్ ,డివిజన్ కార్యదర్శి పూదరి సాయికిరణ్ aiyf మండల కార్యదర్శి సాలిగామ సంతోష్ లు అన్నారు. ఈ సందర్బంగా రెబ్బెన మండల కేంద్రం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో వారు మాట్లాడుతూ దేశం లోని పేద,బడుగు వర్గాల విద్యార్థులకు నిరుద్యోగ యువతకు విద్య, ఉపాధి హక్కుల కోసం, దళిత,ముస్లిం, గిరిజనులు,ఆదివాసుల మీద జరుగుతున్న దాడులు అరికట్టాలని ఈ నెల 22 వ తేదీన ఏ ఐ ఎస్ ఎఫ్,ఏ ఐ వై ఎఫ్ అధ్వర్యం లో పార్లమెంట్ మార్చ్ ని దేశం లోని విద్యార్థులు,నిరుద్యోగ యువత పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.అదే విదంగా ప్రైవేట్ రంగం లో రిజర్వేషన్ అమలు కోసం డిమాండ్ చేశారు.కేంద్రం లో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత దేశం లో అనేక సమస్యలు, సంఘటనలు ఉత్పన్నం అవుతున్నాయని,విద్యారంగానికి నిధులు కేటయించకుండ,విద్యారంగం లో బిజెపి విధానాలకు అనుకూలంగా మత విద్యను పాఠ్య అంశాలలో ప్రవేశాపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. ఎడ్యుకేషన్ సిస్టన్ 2016 పాలసీ ని విరమించుకోవాలని, విద్య వ్యాపారం ,మతపరమైన మూఢ నమ్మకాల విద్య విధానం, విదేశీవిశ్వవిద్యాలయాలను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.ఉచిత విద్య సమానమైన శాస్త్రీయ సాంకేతిక విద్య విధానం అందరికి అందుబాటులో కి తేవాలని అందరికి ఉద్యోగాలు కల్పించేందుకు భగత్ సింగ్ జాతీయ ఉపాధి రోజ్ గర్ యాక్ట్ ను అమలు చేయాలనీ డిమాండ్ చేశారు.పార్లమెంట్ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఉపాధ్యాయ పోస్ట్లు భర్తీ చేయాలి
ఉపాధ్యాయ పోస్ట్లు భర్తీ చేయాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి). సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం జిల్లాలోని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనీ డి . ఈ. డి మండల అధ్యక్షుడు ఆత్రం తిరుపతి బుధవారం నాడు రెబ్బెన తహశీల్ధార్ రమేష్ గౌడ్ కి వినతిపత్రం అందచేశారు అనంతరం మాట్లాడుతూ ప్రణాళిక ప్రకారం డి.ఎస్.సి. నిర్వహించాలని అలాగే టెట్ వెయిటేజ్ ను ఉంచుతూ డి.ఎస్.సి సిలబస్ ను ప్రకటించాలన్నారు ప్రభుత్వ పాఠశాలలను మూసివేతను విరమించుకోవాలని అన్నారు. ఈ సందర్బంగా తహశీల్ధార్ రమేష్ గౌడ్ మాట్లాడుతూ ఉన్నత అధికారులకు తెలియజె స్తాం అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు రాజేశం కోశాధికారి సత్యనారాయణ చారి ప్రధాన సలహాదారులు దుర్గం రాజ్ కుమార్, శ్యా0రావు మహేందర్ రాము సురేష్ లు పాల్గొన్నారు.
డిజిటల్ తరగతులు ప్రారంభం
డిజిటల్ తరగతులు ప్రారంభం
కొమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) జిల్లా లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బోధన సరళతరం చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో డిజిటల్ తరగతులను ప్రారంభించారు. పాఠశాలలో విద్యార్థుల కోసం రాజీవ్ మాధ్యమిక శిక్షా అభియాన్(ఆర్ఎంఎస్ఏ) వారు అవసరమైనా సాంకేతిక పరికరాలను పంపిణీ చేశారు. రెబ్బెన లోని జిల్లా పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు బుధవారం జడ్ పి టి సి ఏ .బాబురావు ఎం పి పి సంజీవ్ కుమార్ ముఖ్య అతిధిగా హాజరై డిజిటల్ తరగతులను ప్రారంభించారు విద్యాధికారి వెనకటేశ్వర స్వామి మాట్లాడుతూ 6 నుంచి 10వ తరగతి వర కు రాష్ట్ర ప్రభుత్వ డిజిటల్ తరగతులనుప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.55 గంటల వరకు, మధ్యాహ్నం 2-4 గంటల మధ్య తరగతులు ప్రసారమవుతాయని తెలిపారు. ప్రైవేట్కు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్త మ ఫలితాలు సాధించేలా ఈ తరగతులను ప్రారంభించారని ఆధునిక యుగం లో విద్యను డిజిటల్ గ అందించడం విద్యార్థుల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుందని అన్నారు కార్యక్రమంలో ఎం పి డి ఓ సత్యనారాయణ సింగ్ ,ఉప సర్పంచ్ బొమ్మినేని శ్రీధరకుమార్ , ప్రధానోపాధ్యాయురాలు స్వర్ణలత, శంకర్ సురేష్ ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దశాబ్ద ఉత్సవాలు విజయవంతం చేయండి --తెలంగాణ విద్యార్థి వేదిక
దశాబ్ద ఉత్సవాలు విజయవంతం చేయండి --తెలంగాణ విద్యార్థి వేదిక
కొమురం బీమ్ ( వుదయం ప్రతినిధి) రెబ్బెన మండల కేంద్రం లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో దశాబ్ది ఉత్సవాల కరపత్రాలు విడుదల చేయడం జరిగింది టి వి వి జిల్లా అధ్యక్షుడు ప్రణయ్ మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ లక్ష్యముగా 26 ఆక్టోబర్2006 లో అతికొద్ది మందితో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఏర్పడింది ఈ ప్రజాస్వామిక తెలంగాణతోనే ప్రజల విద్యార్థుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలంగాణ టి వి వి విశ్వసించింది ప్రజాస్వామిక తెలంగాణ దిశగా సాధించే అందుకు గ్రామాలకు తరలండి అనే నినదాంతో ప్రతి గ్రామగ్రామాన అవగాహన కార్యక్రమాలు చేపట్టింది పది వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భముగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియం నందు భారీ బహిరంగ సబ నిర్వహించడం జరుగుతుంది ఈ సభను విద్యార్హులు మేధావులు ప్రజాస్వామిక వాదులు విజయవంతం చేయాలనీ తెలంగాణ విద్యార్థి వేదిక పిలుపునిచ్చింది ఈ కార్యక్రమంలో టి వి వి డివిజనల్ కార్యదర్శి ప్రదీప్ ప్రధాన కార్యదర్శి శివాజీ నాయకులూ రజిని కాంత్ విజయ్ శ్రీకాంత్ విద్యార్థులు పాల్గొన్నారు
ముదిరాజ్ ల మహా యాత్ర పోస్టర్ల విడుదల
ముదిరాజ్ ల మహా యాత్ర పోస్టర్ల విడుదల
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలంలో ముదిరాజ్ యూత్ మహా పాద యాత్ర హలో ముదిరాజ్ చలో హైదరాబాద్ పోస్టర్లను విడుదల చేశారు . ఈ సందర్బంగా జిల్లా నాయకులు ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడు పెసరు మధునయ్య ముదిరాజ్ మాట్లాడుతూ ముదిరాజ్ లను బి సి డి నుండి బి సి ఏ కులమునకు మార్చాలని అన్నారు .బి సి ఏ లో కలపడం వాళ్ళ యువతకు ఉపాధి కల్గుతుందని ,యువతకు రుణ సదుపాయం,కల్పించాలని అన్నారు ఈ మహా పాద యాత్ర డిసెంబర్ 2 నుండి 18 వరకు ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వరకు కొనసాగుతుందని అన్నారు జిల్లా యువజన ఆధ్వర్యములో చలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు తేలిపారు. . హైద్రాబాద్ లోఇందిరాపార్క్ లో నిర్వహించే బారి బహిరంగ మహా సభకు ముదిరాజ్ కులస్తులందరు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆయన అన్నారు . ఈ కార్య క్రమములో ముదిరాజ్ సంఘం నాయకులు ముల్కల్లపల్లి వెంకటేశ్వర్లు , అంకం పాపయ్య ,మూడెడ్ల శ్రీనివాస్ ముదిరాజ్ తోట లక్మన్ , అంకం స్వామి ముదిరాజ్ , పేట మల్లయ్య , రమేష్ , సందీప్, పోతిరెడ్డి రమేష్ ,ఎర్రం మల్లేష్ లు ఉన్నారు.
Monday, 14 November 2016
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా రవీందర్ ,ఉపేందర్లు ఎన్నిక
సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులుగా బోగే ,దుర్గoలు
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్ల్లా సి పి ఐ కౌన్సిల్ సభ్యులుగా మండలములోని గోలేటికి చెందిన దుర్గం రవీందర్ , బోగే ఉపేందర్ లను ఎంపిక చేశారు . ఆసిఫాబాద్ లో ఈ నెల 13 , 14 తేదీలలో నిర్వహించిన సి పి ఐ ఆదిలాబాద్ జిల్లా నిర్మాణ సభలు జరిగాయి . ఈ సభలలో బోగే ఉపేందర్ , దుర్గం రవీందర్ లను సి పి ఐ రాష్ట్ర నాయకులు చాడ వెంకట్ రెడ్డి ప్రత్యకంగా అభినందించారు . ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పార్టీ బలోపితానికి సైనికుల్లా పని చేసి పార్టీని జిల్లాలో మరింత విస్తర పరుస్తామని తెలిపారు.
సింగరేణి ఆధ్వర్యములో బాలల దినోత్సవం
సింగరేణి ఆధ్వర్యములో బాలల దినోత్సవం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి సేవ సమితి ఆధ్వర్యములో గోలేటిలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా బెల్లాపల్లి ఏరియా జెనరల్ మేనేజర్ కె రవి శంకర్ నెహ్రు చిత్ర పటానికి పూపూల మాలలు వేశారు . ఈ సంధరఁగా విద్యార్థులకు ఆటల పోటీలు , డ్యాన్స్ పోటీలు నిర్వహించారు . విద్యార్థులు చేసిన నృత్యాలు అందరిని ఆకట్టుకొన్నాయి . ఈ సందర్బంగా జి ఎం రవిశంకర్ మాట్లాడుతూ నెహ్రు ప్రధానిగా మన దేశానికి ఎన్నో సేవలు చేసారని అన్నారు . పిలాలంటే అతనికి ఎంతో ఇష్టమని , మాజీ ప్రధాని పుట్టి న రోజును పిల్లలతో నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు . ఈ కార్య క్రమములో డి జి ఎం చిత్తరంజనాకుమార్ , ఎస్ ఓ టు జి ఎం కొండయ్య , డి వై పి ఎం రాజేశ్వర్ , కార్మిక సంఘ నాయకులు సదాశివ్ , తిరుపతి సేవ సమితి సభ్యులు శంకరమ్మ , సొల్లు లక్ష్మి లు ఉన్నారు .
రెబ్బెనలో ఘనంగా బాలల దినోత్సవం
రెబ్బెనలో ఘనంగా బాలల దినోత్సవం
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) రెబ్బెన మండలములో బాలల దినోత్సవాన్ని ప్రైవేట్ , ప్రభుత్వ పాఠశాలలలో సోమవారం ఘనంగా నిర్వహించారు . ఈ సందర్బంగా ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాఠశాల కరెస్పాండెంట్ ఢీకొండ విజయ కుమారి , విశ్వశాంతి హెడ్మాస్టర్ పోచయ్య లు నెహ్రు చిత్ర పటానికి పూల మాలలు వేశారు . అనంతరం విద్యార్థులకు మిఠాయిలు పంచారు . కరెస్పాండెంట్ విజయ కుమారి మాట్లాడుతూ పిలాలంటే నెహ్రు కు ఎంతో ఇస్తామని , చాచా నెహ్రు జన్మ దినాన్ని పిల్లలతో జరుపుకోవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు . ప్రధాన మంత్రిగా దేశానికి ఎన్నో సేవలు చేశారు . నెహ్రు జీవిత చరిత్రను విద్యార్థులకు వివరించారు . ఈ కార్య క్రమములో ఎస్ వి ఇంగ్లిష్ మీడియం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఢీకొండ సంజీవ్ కుమార్ , ఉపాధ్యాయులు తిరుపతి , సుజాత విద్యార్థులు ఉన్నారు.
Friday, 11 November 2016
కాంట్రాక్టు కార్మికుల టోకెన్ సమ్మె
కాంట్రాక్టు కార్మికుల టోకెన్ సమ్మె
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని శుక్రవారం నాడు 48 గంటల టోకెన్ సమ్మె లో పాల్గొన్నారు. అన్ని కాంట్రాక్టు సంఘల పిలుపు మేరకు వారు సమ్మె చేపట్టడం జరిగింది.ఈ సంధర్బంగ అందరు కార్మికులు విధులను బహిష్కరించి వారి నిరసనను తెలియజేశారు. ఏ ఒక్క కాంట్రాక్టు కార్మికుడు విధులకు హజరు కాకుండా గోలేటి నాలుగు స్టంబాలు ఆర్చి వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగ పలువురు కార్మికులు మాట్లాడుతు చాల కాలం నుండి తక్కువ వేతనం కు పనిచేస్తన్నమని వేజ్ బోర్డు లో ఒప్పందం జరిగిన మొదటి క్యాటగిరి వేతనాన్నివెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే స్వరాష్ట్రం లో కూడా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు.కాంట్రాక్టు కార్మికులను పెర్మనెంట్ చేస్తా అని అన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్ ఎన్నికల సందర్బంగ ఇచ్చిన హామీ ని వెంటనే నెరవేర్చాలని అన్నారు. ఈ సమ్మె రెండు రోజులు కొనసాగుతుందని సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమ్మె లో కాంట్రాక్టు కార్మికులు బోగే ఉపేందర్, బండారు తిరుపతి,చల్లూరి అశోక్,కిరణ్, అశోక్ గౌడ్,వెంకటేష్, రాజేష్,ఆశలు,రాయిలా నర్సయ్య,కాంట్రాక్టు మహిళా కార్మికులు,తదితరులు పాల్గొన్నారు.
గెస్ట్ హౌస్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి : పూదరి సాయి
గెస్ట్ హౌస్ కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలి : పూదరి సాయి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నాణ్యత పాటించకుండా నాసిరకంగా భోజనం పెడుతున్న గోలేటి సింగరేణి అతిధి గృహం కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని ఏ ఐ ఎస్ ఎఫ్ డివిజన్ కార్యదర్శి పూదరి సాయి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగ గోలేటి లోని సిపిఐ కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశం లో ఆయన మాట్లాడుతు నాణ్యాత పాటించకుండా నాసిరకంగ బొజనం పెడుతు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు.రెండు రోజుల క్రితం కూరలు కూడా ఫ్రీజ్ లో పెడుతు మల్లి వాటినే భోజనాల్లో వడ్డిస్తున్నారని అన్నారు. అతిధి గృహనికి వెళ్లిన వారి పట్ల అమర్యాదగా వ్యవహరిస్తూ దుర్భాషలాడుతున్నారని అన్నారు.సింగరేణి అధికారులతో పాటు సంస్థలో పరోక్షంగా విధులు నిర్వహిస్తున్న వారికి కూడా భోజనం అందించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ వారు మాత్రం నియమనిబంధనలు పాటించకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని అన్నారు. ఉచితంగా ఏమి అందించడం లేదు కదా డబ్బులు తీసుకోని భోజనం అందించడం లో వారికి వచ్చిన సమస్య ఏంటి అని ప్రశ్నించారు. భోజన విషయం లో కూడా నాణ్యత పాటించడం లేనందున సింగరేణి అధికారులు పరిశీలించి వారి పట్ల చర్యలు తీసుకోవాలని,అదే విధంగా సంబంధిత కాంట్రాక్టర్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు.
అంగన్ వాడి లా సమస్యలు పరిష్కరించాలి
అంగన్ వాడి లా సమస్యలు పరిష్కరించాలి
కొమురం బీమ్ (రెబ్బెన వుదయం ప్రతినిధి) నగదు బదలీ లో నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని సి ఐ టి యూ జిల్లా అధ్యక్షులు అల్లూరి లోకేష్ అన్నారు .రెబ్బెన తాసిల్దర్ కార్యాలయం ముందు ధర్నా నివ్యయించి అంగన్ వాడి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని గురువారం జూనియర్ అసిస్టెంట్ ఊర్మిళ కు అందజేసారు అనంతరం వారు మాట్లాడుతూ ఐసీ డీయస్ లో నగదు బదిలీ పథకాన్ని రద్దుచేయాలి ఫ్రీ స్కూల్ పిల్లల్ని అంగన్ వాడి సెంటర్స్ లోనే ఉంచాలి కేంద్రాలను పక్క భవనాలను నిర్మించాలి మూలికా సదుపాయాలు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలుపుదల చేసి ఇంర్కిమెంట్ ను పునరుర్దారించాలి
అర్హులైన అంగన్ వాడిలకు ఆసరా పెంషన్ కలిపించాలి అర్హులైన ఆయాలు టీచర్లుగా పజొన్నతులు కల్పించాలన్నారు ఈ కార్యక్రమం లో చంద్రకళ ,సంధ్యారాణి, బాలమ్మ, ప్రమీల రాజేశ్వరి ,శ్యామల మల్లేశ్వరి ,సుసీల ,మంజుల, భాగ్యలక్ష్మి ,సంభా లక్ష్మి, భారతి ,శుష్మ తదితర అంగన్ వాడి కార్యకర్తలు పాల్గొన్నారు.
Subscribe to:
Posts (Atom)