ఎ,అయ్,ఎస్,ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ
రెబ్బెనలో ఎ,అయ్,ఎస్,ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ ఆధ్వర్యంలో అంతరాష్ట్ర రహాదారిపై విద్యార్థులతో ర్యాలీని నిర్వహించారు. అనంతరం ఎఅయ్ఎస్ఎఫ్ జిల్లా జిల్లా ఇంచార్జ్ తిరుపతి ఎఅయ్ఎస్ఎఫ్ జెండాను ఆవిష్కరించారు. ఎఅయ్ఎస్ఎఫ్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దుర్గం రవీందర్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని, కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించాలని,ఫీజు రియంబర్స్ మెంట్ ను, స్కాలర్ షిప్ ను విడుదల చెయ్యాలని, పాఠశాలలు, హాస్టళ్లలో మౌళిక వసతులను కల్పించాలని డిమాండ్ చేశారు.విద్యార్థులు సమస్యలు పరిష్కరించే వరకు నిర్విరామంగా దశల వారిగా పోరాడతామన్నారు. ఈ కార్యాక్రమంలో ఏ,అయ్,వై,ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు బోగే ఉపెంధర్, కౌన్సిల్ సభ్యులు రవి, మండల అధ్యక్షులు పూదరి సాయి, ఏ,అయ్,టీ,యు,సి మండల కార్యదర్శి రాయిల్ల నర్సయ్య, నాయకులు సతీష్, శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment