Wednesday, 16 September 2015

ఆశా కార్యకర్తల వినూత్న నిరసన

ఆశా కార్యకర్తల వినూత్న నిరసన

నిరవధిక సమ్మె బుధవారనికి 15వ రోజుకు చేరిన తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదని ఉరివేసుకొని ఆశా కార్యకర్తలు వినూత్నరీతిలో రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు నిరసన తెలిపారు. సమ్మెలో భాగంగా  సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని, అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కేవలం నాలుగు వందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించి  ఉన్నప్పటికి  కనీస వేతనంతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, చాయ, నిర్మల, స్వప్న, తిరుమల, రమాదేవి, రాజేశ్వరి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment