ఇండియాలో లీటరు పెట్రోలు ధర రూ. 25 వరకూ తగ్గబోతుంది..!!
భారత్ లో లీటరు పెట్రోలు ధర రూ. 25 వరకూ తగ్గబోతుంది. ఆహా.. వింటేనే ఎంత హాయిగా ఉందో కదా.. మరి నిజంగా జరిగితే..?జరుగుతుంది అని అంటున్నారు అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ గోల్డ్ మన్ శాక్స్. అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధర పాతాళానికి దిగజారనుందని.. లండన్ కమోడిటీ మార్కెట్లో బ్యారల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 6 ఏళ్ళ కనిష్ఠ స్థాయిలో 48 డాలర్ల వద్ద ఉండగా.. ఈ ధరలు మరింత దిగజారి 20 డాలర్ల స్థాయిని తాకవచ్చని గోల్డ్ మన్ శాక్స్ భావిస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లోకి వస్తున్న సరఫరా అధికంగా ఉండటమే ఇందుకు ముఖ్య కారణమని తెలిపింది. చైనా ఆర్థిక వ్యవస్థలోని ఆందోళన సైతం ఇది ప్రభావితం చేస్తుందని అంచనా వేస్తున్నారు. అమెరికా నుంచి రోజుకు 5.85 లక్షల బ్యారళ్ల ముడి చమురు మార్కెట్లోకి వస్తోందని వెల్లడించారు.
కాగా.. మార్చి 2009 తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి చేరడం ఇదే తొలిసారి. గత ఏడాది జూన్ లో 115 డాలర్ల వద్ద ఉన్న క్రూడాయిల్ ధర 60 శాతానికి పైగా తగ్గింది. గోల్డ్ మన్ శాక్స్ అంచనాల ప్రకారం క్రూడాయిల్ ధర 20 డాలర్లకు చేరితే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 'పెట్రో' ఉత్పత్తులపై అమ్మకపు, ఎక్సైజ్ పన్నులను పెంచ కుండా ఉంటే.. భారత్ లో లీటరు పెట్రోలు ధర రూ. 25 తగ్గడం ఖాయం.
No comments:
Post a Comment