Monday, 14 September 2015

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి

గణేష్‌ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలి 


గణేష్ ఉత్సవాలను అందరూ కులమతాలకు అతీతంగా ఐక్యమత్యంతో సోదరభావంతో 11రోజుల పాటు జరిగే గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించాలని తాండూర్ సీఐ కరుణాకర్ పిలుపునిచ్చారు. సోమవారం పోలీసు స్టేషన్లో గణేష్ ఉత్సవ కమిటి సభ్యుల అవగాహన సమావేశం నిర్వహించారు.ఈసందర్బంగా సీఐ కరుణాకర్ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా 11రోజుల పాటు భక్తి శ్రద్దలతో సాంప్రదాయ బద్దంగా నిర్వహించాలని గణేష్ మండళ్ల నిర్వహకులకు సూచించారు. ఉదయం ఆరుగంటల నుంచి రాత్రి పది గంటల వరకు మాత్రమే మైకులు వాడాలని ఆతర్వాత ఎట్టి పరిస్థితుల్లో మైక్‌ వాడరాదని రెండు స్పీకర్లు మాత్రమే వాడాలని డిజె సౌండ్‌ సిస్టమ్‌ వాడటానికి అనుమతించబడని సూచించారు. ఈ సమావేశంలో రెబ్బన ఎస్సై హనూక్, ఎంపీపీ కార్నాధం సంజీవ్, జడ్పిటిసి బాబురావు, గణేష్ ఉత్సవకమిటీ సభ్యులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment