బతుకమ్మ ఆడుతూ ఆశా కార్యకర్తల వినూత్న నిరసన
రెబ్బెనలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కార్యాలయం ముందు సమ్మెలో భాగంగా ఆశా కార్యకర్తలు తెలంగాణా ఆడపడుచుల ముఖ్య పండగైన బతుకమ్మ ఆడి వినూత్నరీతిలో నిరసన తెలిపారు
సీ,అయ్,టీ,యు మండల
అధ్యక్షురాలు ఆశ కార్యకర్త అనిత మాట్లాడుతూ ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని, కనీస వేతనం రూ.15వేలు చెల్లించాలని,
అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కాలంలో తమ నిరసన 20వ రోజుకు చేరినా ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకర మన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు రోగులకు వైద్యసేవలు అందించి ఉన్నప్పటికి కనీస వేతనంతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు
కవిత,స్వప్న, తిరుమల,
ఛాయ ,రాజేశ్వరి,
నిర్మల, రమాదేవి, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment