టీవీవీ సంతకాల సేకరణ
తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో రెబ్బెన మండలంలో మంగళవారం సంతకాల సేకరణ చేపట్టారు. టీవీవీ జిల్లా అధ్యక్షుడు కడతల సాయి మట్లాడుతూ ఆసిఫాబాద్ డివిజన్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని ఈ విషయంపై అధికారులకు ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చిన పట్టించుకోవడంలేదని ప్రభుత్వం ఈ కళాశాల ఏర్పాటుపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. సేకరించిన సంతకాలను పై అధికారులకు అలాగే విద్యాశాఖ మంత్రులకు పంపిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టీవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల శివాజీ, మండల కన్వీనర్ సాయి నవతేజ, శ్రావణ్, నవీన్, ప్రవీణ్, తిరుపతి పాల్గొన్నారు.
No comments:
Post a Comment