ఆరోగ్యకార్యాలయం ముందు ఆశాకార్యకర్తల ధర్నా
ఆరోగ్యకార్యాలయంఆశాకార్యకర్తల ధర్నారెబ్బెనలో శనివారనికి 11వరోజుకు చేరుకుంది. సీ,అయ్,టీ,యు మండల అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ కనీస వేతనం రూ.15వేలుచెల్లించాలని, ఉద్యోగ భద్రత, పదోన్నతులు కల్పించాలని. అర్హులైన వారిని ఏ,ఎన్,ఎం లుగా గుర్తించాలని, కేవలం నాలుగువందల రూపాయల వేతనంతో ముప్పై రోజులు కష్టపడి పనిచేస్తున్న సకాలంలో ఆగౌరవ వేతనం కూడ అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం తమ కష్టాలు పట్టించుకోకపోవడం దుర దృష్టకరమన్నారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యసిబ్బందితో విధులు నిర్వహిస్తున్నప్పటికి ఉద్యోగ భద్రత కల్పించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉద యం నుంచి రాత్రుల్లో రోగులకు వైద్యసేవలు అందించి ఉన్నప్పటికి తమ న్యాయమైనటువంటి డిమాండ్లను నెరవేర్చడం లేదని, కనీస వేతనంతో తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు రమ, ఆసంఘం కార్యకర్తలు కవిత, నిర్మల, చాయ రమాదేవి, రాజేశ్వరి, స్వప్న, తిరుమల, లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment