Saturday, 29 September 2018

వట్టివాగు ప్రాజెక్య్త నీరు విడుదల చేయాలి

రెబ్బెన ; రెబ్బెన మండలంలోని వట్టివాగు ప్రాజెక్య్త నుండి వరిపంటకు నీరు విడుదల చేయాలని శనివారం రైతులు  రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్నకు వినతిపత్రం  సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వట్టివాగు ప్రాజెక్ట్ నీటిని నమ్ముకొని మండలంలోని నక్కలగూడ, పుంజుమ్మెరా గూడా, ఇందిరా నగర్, రెబ్బెన, సింగల్ గూడ,  గ్రామాలలోని రైతులు  సుమారు 350  ఎకరాలు సాగు చేస్తున్నారని  గత 20 రోజులుగా డిస్ట్రిబ్యూషన్ 9 నుండి 12 వరకు గల పంటపొలాలకు నీటిని విడుదల చేయడం లేదని, సంభందిత అధికారులకు ఎన్నిసారు మొరపెట్టుకున్నా నిర్లక్ష్యం వహిస్తున్నారని , కావున వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో  రైతులు వనమాల మురళి, సుదర్శన్ గౌడ్  రావుజీ. వాడై శివరాం,సురేష్, ఓ సురేష్, తిరుపతి, భీంరావు, రాజు, మురళి గోపీచంద్, శంకర్, బాలాజీ, అజ్మీరా రమేష్, వెంకటేశ్వర గౌడ్, ఎల్ రమేష్, కొత్రాంగిహన్మంతు, తదితర వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment