కొమురంభీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 18 ; రెబ్బెన ; కాంట్రీబ్యూటరీ పింఛన్ రద్దు.మధ్యంతర భృతి .పి ఆర్ సి అమలు చేయాలని ఎస్ సి ఎస్ టి ఉపాధ్యాయ సంఘం కుంరంభీం జిల్లా అధ్యక్షులు మేడి చరణ్ దాస్, ఎస్ టి యు జిల్లా ఉపాధ్యక్షులు చునార్కర్ తుకారం లు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగ .ఉపాధ్యాయ సంఘాల పిలుపు మేరకు మంగళవారం రెబ్బెన జిల్లాపరిషద్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మధ్యాన్న భోజన సమయములో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్య మంత్రి కెసిఆర్ ఉద్యోగ .ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలన్నారు. ఈకార్యక్రమములో జి భానేశ్ మరియు పాఠశాల ఉపాధ్యాయులు మొహమ్మద్ అనీస్ కె ఉదయ్. ప్రభాకరరావు .జమున దాస్. వశిం అహమ్మద్.గోపాల్ . శంకర్లింగం . శ్రీదేవి . సుదేవి. పుష్పాలత .పార్వతి .శ్రీలత. తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment