కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 ; ప్రజా సంక్షేమం అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక తెలంగాణా రాష్ట్ర సమితి అని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ , మాజీ ఎం ఎల్ ఏ కోవలక్ష్మి లు అన్నారు. శుక్రవారం అసిఫాబాద్ నియోజక వర్గం నుండి 2019 'సాధారణ ఎన్నికలలో తెరాస పార్టీ అభ్యర్థిగా మాజీ ఎం ఎల్ ఏ కోవ లక్ష్మిని ప్రకటించినందుకు రెబ్బెన మండల కేంద్రంలో తెరాస శ్రేణులు భారీ బైక్ ర్యాలీతో హైదేరాబద్ నుండి వస్తున్న కోవలక్ష్మి కి స్వాగతం పలికి ప్రధాన రహదారి వెంబడి ఎమ్మెల్యే స్వగృహం వరకు భారీ ఎత్తున ర్యాలీ గాతోడ్కొని వెళ్లారు. రెబ్బెన మండల కేంద్రములో ఇంటింటా మిఠాయిలు పంచు కొని నోరు తీపి చేసుకున్నారు. వారి ఆనందాన్నిఅట పాటలతో వ్యక్త పరిచారు. ర్యాలీ ప్రారంభ సమయంలో బాణాసంచాకాల్చారు. ఈ సందర్భంగా కోవలక్ష్మి మాట్లాడుతూ తెరాస అధ్యక్షులు కెసిఆర్ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిబాటలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస నాయకులూ, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
No comments:
Post a Comment