Friday, 7 September 2018

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 క్రీడాకారులు  పోటీలలో  ప్రతిభ కనపరచి జాతీయ  స్థాయి  కోల్  ఇండియా పోటీలలో రాణించి  సంస్థకు పెరుతేవాలని జీఎం  కె  రవిశంకర్ అన్నారు.   శుక్రవారం  సింగరేణి ఏరియా డబ్ల్యూ పి  ఎస్ అండ్ జి ఏ  ఆధ్వర్యంలో  రెబ్బెన  మండలం గోలేటి  భేమన్న స్టేడియం లో ఏరియా 86వ  బాస్కెట్ బాల్  పోటీలను  జీఎం  కె  రవిశంకర్ క్రీడా పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడుతూ    క్రీడాకారులు క్రీడా స్ఫూర్తి తో ఆడాలని అన్నారు. ఈ పోటీలలో ప్రతిభ కనపర్చి కోల్  ఇండియా పోటీలలో కూడా  సింగరేణికి పేరుతేవాలని అన్నారు. సింగరేణి సంస్థ కేవలం ఉత్పత్తే కాకుండా కార్మికులలో క్రీడాసక్తిని ప్రోత్సహహించడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తున్నదన్నారు. . ఈ కార్యక్రమంలో   డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, డీపీఎం రామశాస్ట్రీ , రమేష్, కోఆర్డినేటర్ జి పి  చంద్ర కుమార్, క్రీడాకారులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment