Wednesday, 12 September 2018

సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు : రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్12 ; సోషల్ మీడియాలో  మతపరమైన, రాజకీయ  పరమైన వ్యాఖ్యలు, చేయకుండా నిగ్రహం పాటించాలని   రెబ్బెన ఎస్సై దీకొండ రమేష్ అన్నారు.  బుధవారం రెబ్బెన పోలీస్  స్టేషన్ లో  మండలంలోని  అన్నిసోషల్  గ్రూపుల అడ్మిన్ లను సమావేశ పరచి మాట్లాడారు.  వాట్స్ అప్ లో అనాలోచితంగా రెచ్చగొట్టే మెసేజెస్ లు వ్యాఖ్యలు మత పరమయిన రెచ్చగొట్టే సందేశాలు వ్యాఖ్యలు ఎన్నికల పార్టీల మీద రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని కోరారు. సోషల్ మీడియాని ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా,  ఆలోచన శక్తిని పెంపొందించేలా ఉపయోగించాలని అన్నారు. ఇతరుల మనోభావాలను గాయపరిచేలా ఉండకూడదని అన్నారు.. రాబోయే ఎన్నికలను, పండుగలను      దృష్టిలో ఉంచుకొని ఎవరిని నొప్పియ్యని  మండల అభివృద్ధికి సంబందించిన  వార్తలు వంటివి పంపగలరు .  సభ్యులు ఓపికతో ప్రవర్తించి ఒక మంచి గ్రూప్ గ నడవాలని అన్నారు. . ఎవరిని ఏ పార్టీని విమర్శించకుండా సమస్యలపై దృష్టి పెడదాం . మండలంలోని ప్రజల   మేలు కోసం ప్రయత్నించాలన్నారు.  .నలుగురికి ఉపయోగపడేలా గ్రూప్ ని వాడాలని  . అనాలోచిత మెస్సగెస్ పెట్టుట ఫార్వర్డ్ చేయుట ఊరిలో అల్లర్లకు దారితీస్తాయి. అందువల్ల మెసెజ్ లు పెట్టినవారితో పాటు అడ్మిన్స్ కూడా కేసుల పాలు అవుతారు  ఇటువంటి .సందేశాలు పోలీసులు విశ్లేషణలో ఉంటాయని కావున జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

No comments:

Post a Comment