కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; టి ఎస్ పి ఎస్ సి వారు రెబ్బెన ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ఆదివారం నిర్వహించే వి ఆర్ ఓ పరీక్షా కేంద్రాన్ని శనివారం రెబ్బెన సర్కిల్ ఇన్సపెక్టర్ రమణ మూర్తి, ఎస్సై దీకొండ రమేష్ లు సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తి వ్యక్తం చేశారు. పరీక్షకు సర్వం సిద్ధం చేశామని కళాశాల ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని తెలిపారు. పరీక్షా కేంద్రంలో అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామని అన్నారు. త్రాగు నీటి సదుపాయాన్ని కల్పించినట్లు తెలిపారు. ఈ పరీక్షకు చీఫ్ సూపరింటెండెంట్ గా ప్రిన్సిపాల్ జాకిర్ ఉస్మాని, అడిషనల్ చీఫ్ సూపెరింటెండ్లుగా మల్లేష్, స్వప్నలు వ్యవహరిస్తున్నారని తెలిపారు.
No comments:
Post a Comment