Monday, 17 September 2018

క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయి

 కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 17 ;  రెబ్బెన ; క్రీడలు మానసిక ఉల్లాసానికి తోడ్పడతాయని ఎస్ ఈ సివిల్ కె సత్యనారాయణ అన్నారు. సోమవారం రెబ్బెన మండలం గోలేటి భీమన్న స్టేడియం లో బెల్లంపల్లి ఏరియా డబ్ల్యూపీఎస్ అండ్ జీఏ ఆధ్వర్యంలో డిపార్ట్మెంటల్ హాకీ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి     ముఖ్యఅతిథిగా  పాల్గొని  హాకీ క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడలను ప్రారంభించారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ కిడాకారులు స్పోర్ట్స్ స్పిరిట్ తో ఆడాలని అన్నారు. సింగరేణి సంస్థ బొగ్గు ఉత్పత్తికి కాకుండా ఉద్యోగులలో క్రీడాసక్తిని పెంపొందిస్తున్నదని అన్నారు.  ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్ టిబిజికెఎస్ ఏరియా  వైస్ ప్రెసిడెంట్ మల్రాజ్ శ్రీనివాసరావు, డివైపిఎం ఎల్ రామశాస్ట్రీ, స్పోర్ట్స్ సూపర్ వైజర్ రమేష్, స్పోర్ట్స్ కోఆర్డినేటర్ చంద్రకుమార్, కమ్యూనికేషన్ సెల్ కోఆర్డినేటర్ కుమార స్వామి, క్రీడాకారులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment