Tuesday, 18 September 2018

ప్రణయ్ ఆత్మ శాంతి కోసం క్రొవొత్తుల ర్యాలీ

 కొమురంభీం ఆసిఫాబాద్  సెప్టెంబర్ 18 ;  రెబ్బెన ; కులం వివక్ష కారణంగా పరువు హత్యకు గురైన   ప్రణయ్ ఆత్మ శాంతి కోసం  మంగళవారం రెబ్బెన ప్రధాన రహదారి పై అంబెడ్కర్ విగ్రహం  వరకు  క్రొవొత్తుల ర్యాలీ   కుల మతాలకు  అతీతంగా నిర్వహించారు .ప్రణయ్  కుటుంబానికి న్యాయం జరగాలని సమాజంలో కులవివక్ష నశించాలని డిమాండ్ చేశారు.   కులం, పరువు  కారణంగా ఏ భారత బిడ్డ గురికాకుండా  కుల రహిత సమాజాన్ని ఏర్పరచాలని డిమాండ్ చేసారు. ఆ హత్య మానవత్వం పై  ఒక మచ్చ అని  నాయకుల అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో దళిత ఐక్య రాష్ట్ర నాయకులూ గోగర్ల శోభన్ బాబు, రెబ్బెన మండల ఎస్ టి నాయకులూ గోగర్ల రాజేష్, గోపాలకృష్ణ ,  టి దేవేందర్, లింగంపల్లి ప్రభాకర్, సుధాకర్, పోశం, సోమయ్య, చిరంజీవి గౌడ్, నవీన్ జైవాల్,బొమ్మినేని శ్రీధర్ కుమార్  తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment