Thursday, 20 September 2018

క్రీడాకారులు క్రీడా స్పూర్తితో ఆడాలి ; డిజిఎం పర్సనల్ జె కిరణ్

  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 20 ;  క్రీడాకారులు అందరు క్రీడా స్పూర్తితో ఆడి కంపెనీ స్థాయిలో బెల్లంపల్లి ఏరియా జట్లు   ప్రథమ స్థాయిలో నిలవాలని  ఫైనాన్స్ మేనేజర్ బి శ్రీధర్ ,   డిజిఎం పర్సనల్ జె  కిరణ్  లు అన్నారు.  గురువారం బెల్లంపల్లి సింగరేణి ఏరియా రెబ్బెన మండలం  గోలేటిభీమన్న  స్టేడియం లో  బెల్లంపల్లి డబ్ల్యు డి ఎస్ అండ్ ఏ ఆధ్వీర్యంలో   నియర్ బై ఏరియా కబడ్డీ  మరియు కల్చరల్ పోటీల ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిలుగా హాజరై మాట్లాడారు. క్రీడాకారులు మరియు కళాకారులు మంచి ప్రతిభ చూపాలని అన్నారు.  ఈ పోటీలలో   కంపెనీ స్థాయిలో పాల్గొనే జట్లను ఎంపిక చేయడం జరిగిందని   తెలిపారు   కంపెనీ స్థాయికి ఎంపిక అయిన క్రీడాకారులు  మరియు కళాకారులను బెల్లంపల్లి ఏరియా జిఎం శ్రీ కే రవి శంకర్ అభినందించారు కల్చరల్ పోటీ లకు జడ్జీలు గా  బి రాజా రామ్,   సుదర్శన్ లు  వ్యవహరించగా కబడ్డీ పోటీలకు శ్రీ సతీష్ వ్యవహరించారు.  ఈ కార్యక్రమంలో  డి వై పి ఎం రాజేశ్వర్,   హెచ్ రమేష్ అసిస్టెంట్ స్పోర్ట్స్ సూపర్ వైజర్    శ్రీ జిపి చంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment