Friday, 21 September 2018

ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 21 ;  రెబ్బెన మండలం నంబాలపంచాయతీపరిధిలోని మన్నెగూడకు చెందిన మాడే   మాంతయ్య   ప్రమాదవశాత్తు గ్రామ శివారులోగల కొత్త చెరువులో  పడి  మృతి చెందినట్లు రెబ్బెన ఎస్సై ఢీకొండ రమేష్  శుక్రవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బుధవారం  మధ్యాన్నం  తన వదిన   ఇంటినుంచి బయటకు వెళ్లి  తిరిగి రాకపోవడంతో ఇంట్లోని వారు వెతకగా శుక్రవారం  నంబాల కొత్త చెరువులో చనిపోయి ఉండాగా గమనించి నట్లు తెలిపారు. మృతిని కొడుకు  మాడే  సమ్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని  దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

No comments:

Post a Comment