Saturday, 15 September 2018

స్వచ్ఛతాహి కార్యక్రమంలో సింగరేణి ఉద్యోగులు ముందుండాలి ; జీఎం రవిశంకర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ;  స్వచ్ఛతాహి కార్యక్రమంలో సింగరేణి  ఉద్యోగులు  ముందుండాలని జీఎం  రవిశంకర్ అన్నారు. శనివారం  బెల్లంపల్లి సింగరేణి ఏరియా గోలేటి బస్సు స్టాండ్ పరిసర ప్రాంతాలలో స్వచ్ఛతాహి సేవా కార్యక్రమానికి  జీఎం  కే రవిశంకర్ ముఖ్య  అతిధి గా హాజరయ్యారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. ఆలా చేసినట్లయితేనే మనం భావి తరాలకు స్వచ్ఛ భారత్  ను అందించగలమని అన్నారు. హెల్త్ ఆఫీసర్ లలిత పరిశుభ్రత పైతీసుకోవలసిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో దఁగన్  పర్సనల్ జె  కిరణ్, ఎస్ ఓ టూ జీఎం  సాయి బాబా , ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణాచారి, సీనియర్ సేవ సభ్యులు సొల్లు లక్ష్మి, కుందారపు శంకరమ్మ, కమ్యూనికేషన్ సెల్ కో ఆర్డినేటర్ కుమారస్వామి ,డీపీఎం లు సుదర్శనం, రామశాస్ట్రీ, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు సింగరేణి ఆతాల విద్యార్థులు పాల్గొన్నరు.

No comments:

Post a Comment