Wednesday, 19 September 2018

18 సంవత్సరాలు నిండిన అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలలి


  కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు అందరు ఓటరుగా నమోదు చేసుకోవాలని రెబ్బెన తహసీల్దార్ సాయన్న అన్నారు. బుధవారం రెబ్బెన ఆర్ట్స్ నద్ సైన్స్ కళాశాల ఎన్  ఎస్ ఎస్ విద్యార్థులు ఏర్పాటు చేసిన ఓటరు నమోదు అవగాహన సదస్సులో ముఖ్య అతిధి గా పాల్గొని మాట్లాడారు . గ్రామీణ ప్రాంతాల లోని ప్రతి ఒక్క రు  తన పేరు ఓటరు జాబితాలో ఉన్నది లేనిది చూసుకొని , లేనట్లయితే బూత్ స్థాయి అధికారి దృష్టికి తీసుకుని వెళ్ళి నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్  ఎం ఏ జాకిర్ ఉస్మాని,  కోఆర్డినేటర్ మల్లేష్, అధ్యాపకులు దేవాజి, మల్లేష్, గణేష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment