Friday, 14 September 2018

ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలి


 రెబ్బెన ; ఎన్నికలకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధంగా ఉండాలని రెబ్బెన మండల కాంగ్రెస్ అధ్యక్షులు ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ   కోవూరు శ్రీనివాస్ లు  అన్నారు.    ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ , టి ఎస్ పి  సి  పిలుపు మేరకు రెబ్బెన మండలం వంకులం, కొండపల్లి గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ  కార్యక్రమం  నిర్వహించడం జరిగిందని తెలిపారు.   ఈ కార్యక్రమంలో వంకులం గ్రామ అధ్యక్షులు కాశీనాధ్, కొబ్రగొడ మొండయ్య, మాజీ సర్పంచ్ ప్రేమ్  దాస్ , మాజీ సర్పంచ్ మాంతుమేర, వడై తిరుపతి, యూత్ నాయకులు శ్రీనివాస్, పి.ఎ.సి.ఎస్ ఛైర్మన్ గాజుల రవీందర్,అనిశెట్టి వెంకన్న, దుర్గం రాజేష్, పూదరి రాజు, సంఘం బానయ్య తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment