కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్15 ; ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ని అత్యధిక మెజారిటీ తో గెలిపించాలని మాజీ శాసన సభ్యులు ఆత్రం సక్కు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వ ప్రసాద్రావు లు అన్నారు. ఏ ఐ టి సీ ,టి పి సి సి పిలుపు మేరకు శనివారం రెబ్బెన మండలం గంగాపూర్, తుంగెడ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించి మాట్లాడారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు వివరించాలని కోరారు. తెరాస పార్టీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టాలని వారికి తగిన బుడ్డి చెప్పాలని అన్నారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు, యువకులు కాంగ్రెస్ పార్టీ లో చేరారు, ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముంజం రవీందర్, నంబాల ఎంపీటీసీ కోవూరు శ్రీనివాస్, పి.ఎ.సి.ఎస్ వైస్ ఛైర్మన్ వెంకటేశం చారి , బి.సి సెల్ నాయకులు వెంకన్న, పూదరి హరీష్, ఎల్ .రమేష్ , గంగయ్య, దుర్గం రాజేష్, పూదరి రాజు, సంతోష్ సంఘం బానయ్య తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment