కొమురంభీం ఆసిఫాబాద్ సెప్టెంబర్ 18 ; రెబ్బెన ; రెబ్బెన మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తెరాస మహిళా విభాగం నుంచి మన్యం పద్మఆధ్వర్యంలో మంగళవారం గర్భిణీ స్త్రీలకు అల్పాహారం ఉప్మా పంపిణి చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతు. మండలంలోని వివిధ గ్రామాలనుంచి ప్రతి మంగళవారం పరీక్షల నిమిత్తమై వచ్చే గర్భిణీ స్త్రీలకు అల్పాహారం పంపిణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. తెరాస మహిళా విభాగం తరుపున భవిష్యత్ లో మరిన్నిప్రజాహిత కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమానికి ఆస్పత్రి సిబ్బంది భాగ్య లక్ష్మి, రాజేశ్వరి, కాంత లీల తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment