కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్11 రాబోయే ఎన్నికల దృష్ట్యా ఓటర్ జాబితాను ఈనెల 25 వ తేదీకల్లా సిద్ధంచేయాలని రెబ్బెన మండల తహసీల్దార్ సాయన్న అన్నారు. మంగళవారం రెబ్బెన మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన బూత్ లెవెల్ అధికారుల సమావేశంలో మాట్లాడుతూ రానున్న ఎన్నికలకు అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలని అన్నారు . బూత్ లెవెల్ అధికారులు ఫారం 6,5 లతోపాటు వయస్సు నిర్ధారణ కోసం జనన ధృవీకరణ లేదా 10 వ / 8 వ / 5 వ ప్రామాణిక మార్క్ షీట్ లేదా పాస్పోర్ట్ (ఇండియన్) లేదా పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఆధార్ కార్డులను తీసుకోవచ్చని అన్నారు. జనవరి 1,2018 నాటికి 18 సంవత్సరాలు నిండిన యువతి యువకులు ఓటరుగా నమోదు చేసుకునేటట్లు బూత్ లెవెల్ అధికారులు కృషి చేయాలన్నారు. అక్టోబర్ 6 వరకు ఈ సమావేశంలో ఆర్ ఐ ఊర్మిళ, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మి నారాయణ, ప్రమీల , బాలమ్మ, ఇందిరా, లక్ష్మి, రమ, నిర్మల, భారతి, కళావతి, లత, తిరుపతమ్మతదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment