Friday, 28 September 2018

యూరియా కొరతని వెంటనే తీర్చాలి

రెబ్బెన ; రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతని వెంటనే తీర్చాలని రెబ్బెన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముంజం రవీందర్ డిమాండ్ చేశారు.  రెబ్బెన మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం వద్ద మాట్లాడుతూ మండలంలో యూరియా కొరత తీవ్ర రూపం దాల్చిందని, రైతులు సకాలంలో పంటలకు యూరియా వెయ్యలేక ఇబ్బంది పడుతున్నారని, ఈ సీజన్లో లో వరుణ దేముడు కరుణించినా ప్రభుత్వం , అధికారుల నిర్లక్ష్యంతో పంటలు సరిగా  ఎదగని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో   నంబాల   ఎం.పి.టి.సి సభ్యులు కోవూరు శ్రీ నివాస్, పి.ఎ.సి.ఎస్ ఛైర్మన్ గాజుల రవీందర్, వైస్ ఛైర్మన్ వెంకటేషం చారి, బి.సి సెల్ నాయకులు వెంకన్న  తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment