కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్12 ; బెల్లలంపల్లి సింగరేణి ఏరియా రెబ్బెన మండలం గోలేటిలో డిస్పెన్సరీ లో బుధవారం మట్టి గణపతి ప్రతిమల పంపిణి ప్రారంభించారు. ఈ కార్యక్రమాన్ని సింగరేణి జీఎం కే రవిశంకర్ ప్రారంభించి మాట్లాడారు. ప్లాస్టర్ అఫ్ పారిస్ తో తయారు చేసిన గణపతి ప్రతిమలు పర్యావరణానికి హాని చేస్తాయని అన్నారు.కావున ప్రజలు మట్టితో చేసిన విగ్రహాలను పూజించడం అలవాటు చేసుకోవాలని అన్నారు. ప్రతి గ్రామంలో వీధి విధికి విగ్రహాలు ప్రతిష్ట చేసేకంటే అందరు కలసి ఒకే విగ్రహాన్నిప్రతిష్ట చేసుకొంటే అందరిలో ఐకమత్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ సి హెచ్ శ్రీనివాస్, టిబిజికెఎస్ ఏరియా ఉపాధ్యక్షులు మల్రాజ్ శ్రీనివాస్, ఎన్విరాన్మెంట్ ఆఫీసర్ కృష్ణ చారి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment