Wednesday, 19 September 2018

ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్నిసందర్శించిన రీజినల్ డైరెక్టర్

కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్19 ; రెబ్బెన మండల కేంద్రం లోని ప్రభుత్వ ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని బుధవారం వైద్య  ఆరోగ్య శాఖ రీజినల్ డైరెక్టర్  ప్రభావతి, లెప్రసి  మరియు ఎయిడ్స్ డైరెక్టర్ జాన్సన్ లు సందర్శించారు. ఆసుపత్రి రికార్డు లు, సిబ్బంది హాజరు పై విచారించారు. ఈ సందర్భంగా రెబ్బెన తెరాస నాయకులూ మోడెమ్   సుదర్శన్ గౌడ్, ,చెన్న  సోమశేఖర్ లు రెబ్బెన ఆరోగ్య  కేంద్రాన్ని 30 పడకల  ఆసుపత్రి  గా చేయాలని, 24 గంటలు డాక్టర్ అందుబాటులో ఉండేటట్లు   చూడాలని వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులూ,  ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment