కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్16 ; బీసీ సబ్సిడీ రుణాలు వెంటనే మంజూరు చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ , బీజేవైఎం జిల్లా కార్యదర్శి బత్తిని రాము లు డిమాండ్ చేశారు. రెబ్బెన మండలం గోలేటి లో ఆదివారం విలేఖరులతో మాట్లాడుతూ గత నాలుగు నెలల నుంచి దరఖాస్తు చేసుకొన్న వారందరికీ రుణాలు ఇస్తామంటున్న అధికారులు ఎప్పుడు ఇస్తారో తెలపాలన్నారు. ప్రతిరోజూ ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులు తిరిగి తిరిగి వేసారి పోతున్నారని అన్నారు. బి సి రుణాలు కేవలం పత్రికా ప్రకటనలకే అరిమితమయ్యాయని, ఈ విధంగా జాప్యం చేయడం వలన అధికారులపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే రుణాలు ఇవ్వాలని లేని పక్షంలో తీవ్రక్స్టైలో ఆందోళన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు మోర్లే నరేందర్, లేకురి సుధాకర్, ఏర్రం మల్లేష్,తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment