Friday, 7 September 2018

దృష్టి సమస్యలున్న ప్రజలకు వారి ప్రాంతాలలోనే ఉచిత కంటి పరీక్షలు


కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 ; రెబ్బెన మండలం గోలేటి సింగరేణి సేవాభవన్  లో కంటివెలుగు శిబిరాన్నిశుక్రవారం  సింగరేణి జీఎం కె  రవిశంకర్ ప్రారంభించి మాట్లాడారు. దృష్టి  సమస్యలున్న  ప్రజలకు వారి వారి ప్రాంతాలలోనే ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను సమకూర్చడమే లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు.  సంస్థ తరపున శిబిరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గోలేటిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం  పర్సనల్ జె  కిరణ్, డీపీయం  రామశాస్ట్రీ,  కంటివెలుగు ప్రోగ్రాం  ఆఫీసర్ డాక్టర్ సీతారాం, డాక్టర్ మాధురి,  దూత్ క్లారా, మొయిన్, కమలాకర్, రేణుక, ఆసుపత్రి సిబ్బంది, ఆశ వర్కర్ లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment