కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 07 ; రెబ్బెన మండలం గోలేటి సింగరేణి సేవాభవన్ లో కంటివెలుగు శిబిరాన్నిశుక్రవారం సింగరేణి జీఎం కె రవిశంకర్ ప్రారంభించి మాట్లాడారు. దృష్టి సమస్యలున్న ప్రజలకు వారి వారి ప్రాంతాలలోనే ఉచిత కంటి పరీక్షలు చేసి కంటి అద్దాలను సమకూర్చడమే లక్ష్యంగా తెలంగాణా ప్రభుత్వం ఈ కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించిందని అన్నారు. సంస్థ తరపున శిబిరానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. గోలేటిలోని ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె కిరణ్, డీపీయం రామశాస్ట్రీ, కంటివెలుగు ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ సీతారాం, డాక్టర్ మాధురి, దూత్ క్లారా, మొయిన్, కమలాకర్, రేణుక, ఆసుపత్రి సిబ్బంది, ఆశ వర్కర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment