కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ; పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 102 జన్మదిన వేడుకలు ను మంగళవారం రెబ్బెన మండలం బీజేపీ అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్ జడ్పీటీసీ ఆదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ అజమీర రామ్ నాయక్ మాట్లాడుతూ దేశంలో జరుగుతున్నా అసాంఘిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ స్థాపించి అనేక సేవలను చేసారని , స్వాతంత్రోద్యమంలో జనసంఘ్ పాత్ర ఎంతో ప్రశంసనీయమని అన్నారు. కుందారపు బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి చేపట్టిన ప్రజా సంక్షేమ పనులను గమనించి చాలామంది యువకులు బీజేపీ లో చేరుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో , చక్రపాణి, ఇగురపు సంజీవ్,యలమంచిలి సునీల్ చౌదరి , వెంకటేష్, రాంబాబు, మల్లేష్, సుదర్శన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment