Tuesday, 25 September 2018

పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 102 జన్మదిన వేడుకలు

 
 కొమురంభీం ఆసిఫాబాద్ రెబ్బెన ; సెప్టెంబర్ 25 ;  పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ 102 జన్మదిన వేడుకలు ను మంగళవారం  రెబ్బెన మండలం  బీజేపీ  అధ్యక్షులు కుందారపు బాలకృష్ణ  ఆధ్వర్యంలో ఘనంగా  నిర్వహించారు. ఈ సందర్భంగా సిర్పూర్ జడ్పీటీసీ ఆదిలాబాద్ పార్లమెంటరీ కన్వీనర్ అజమీర రామ్ నాయక్  మాట్లాడుతూ దేశంలో జరుగుతున్నా అసాంఘిక అఘాయిత్యాలకు వ్యతిరేకంగా  పండిట్ డీన్ దయాల్ ఉపాధ్యాయ జనసంఘ్ స్థాపించి  అనేక సేవలను చేసారని , స్వాతంత్రోద్యమంలో జనసంఘ్ పాత్ర ఎంతో  ప్రశంసనీయమని అన్నారు. కుందారపు బాలకృష్ణ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడి  చేపట్టిన ప్రజా సంక్షేమ పనులను గమనించి చాలామంది యువకులు బీజేపీ లో చేరుతున్నారని అన్నారు.  ఈ కార్యక్రమంలో , చక్రపాణి, ఇగురపు  సంజీవ్,యలమంచిలి సునీల్ చౌదరి , వెంకటేష్, రాంబాబు, మల్లేష్, సుదర్శన్ గౌడ్   తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment