రెబ్బెన: (వుదయం ప్రతినిధి); ప్రయివేట్ పాఠశాలల యాజమాన్యాలు వెంటనే ఆధార్ ప్రేండ్లి ఆన్లైన్ లో వేంటనే నమోదు చేయాలనీ రెబ్బెన యం ఈ ఒ వేంకటేశ్వర స్వామి అన్నారు . శనివారం మండల కేంద్రంలోని యం ఈ ఒ కార్యాలయంలో ప్రయివేటు పాఠశాల యాజమాన్యాలకు ఏర్పాటు చేసిన సమావేశంలో అయన మాట్లాడారు . ప్రతి ఉన్నత పాఠశాలలో (6-10)తరగతులు లకు ప్రయోగశాల ఉండాలని , పాఠశాల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు . అదేవిధంగా పాఠశాలలో కనీస వసతులైన మరుగు దొడ్లు , మూత్రశాలలు , త్రాగునీటి సౌకర్యాలు తప్పనిసరిగా ఆడాలని అన్నారు . ఈ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు దీకొండ సంజీవ్ కుమార్ , సుదర్శన్ గౌడ్ , కృష్ణ కుమారి , లక్ష్మణ చారి , రఘపతి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment