పునరావాస వారికి సదుపాయాలు కలిపిస్తాం
రెబ్బెన: (వుదయం ప్రతినిధి);బెల్లంపల్లి ఏరియాలోని కైరుగూడ ఓసిపి కి ముంపుకు గురైన ఉల్లిపిట్ట గ్రామస్థులకు పునరావాస ఏర్పాట్లు కలిపిస్తామని ఎం ఎల్ సి పురాణం సతీష్ కుమార్ అన్నారు. రెబ్బెన మండలం గోలేటి సి ఆర్ క్లబ్ నందు ఎరుపాటుచేసిన ఉల్లిపిట్ట ముప్పు గ్రామస్తుల సమావేశంలో జిల్లా ఎం ఎల్ సి పురాణం సతీష్ స్థానిక ఎం ఎల్ ఏ కోవలక్ష్మి మాట్లాడుతూ బెల్లంపల్లి ఏరియాలోని కైరుగూడ ఓసిపి వాళ్ళ ముంపుకు గురైన ఉల్లిపిట్ట గ్రామస్థులకు ఇప్పటి వరకు ఎటువంటి సౌకర్యలు కలిపించాక పోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారాని .2001 నుండి ఎప్పడివరకు వారు ఓపెన్ కాస్ట్ దుమ్ము దూళి డంప్ఇసుకతో పంట పొలాలన్నీ నాశనం అవుతున్నాయని అధికారులతో ఎన్ని సార్లు తెలిపిన పట్టించుకున్న దాఖలాలు లేవని అన్నారు. మరియు వారి మిగులు భూములు తీసుకోవాలని, డబ్బులు చెల్లించాలని గ్రామస్తులు ఏర్పాటు సమావేశంలో ఎం ఎల్ ఎ కోవ లక్ష్మి ఉళ్లిపీట గ్రామంలో పునరావాస వారికి నీరు , విద్యుత్ , రోడ్లు , పాఠశాల భవనం మరియు పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించి సదుపాయాలు కల్పించాలని సింగరేణి యాజమాన్యం జియం రవి శంకర్ కు సూచించారు . అదేవిధంగా మా స్వంత నిదుల నుండి కొంతమేరకు కేటాయించి పునరావాస సదుపాయాకై కృషి చేస్తామన్నారు . ఈ కార్యక్రమంలో రెబ్బెన మడలం యం పిపి కార్నాధం సంజీవ్ కుమార్ , జడ్ పిటిసి బాబురావు , తిరియాని మండలం యం పిపి లక్ష్మి , జడ్ పిటిసి కమల , అడ్వికేట్ పి గోపి , అసిపాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చేర్మెన్ కుందారపు శంకరమ్మ, తహసీల్దార్ రమేష్ గౌడ్ సర్పంచులు తోట లక్ష్మణ్ , కోవ పార్వతి , స్థానిక యం పిటిసి వనజ , సింగరేణి అధికారులు తదితర గ్రామస్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment