ధర్నాచౌక్ పరిరక్షణ కోసం ఢిల్లీకి తరలిన నాయకులూ
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 20 ; తెలంగాణ రాష్ట్ర సాధన కోసం హైదరాబాద్ లోని ఇందిరపార్క్ ధర్నా చౌక్ ను ఒక వేదికగా చేసుకున్నమని,గతం నుండి అనేక ప్రజా సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేయడానికి ధర్నా చౌక్ వేదికగా ఉండేదని అలాంటి ధర్నా చౌక్ ను ఎత్తివేయడానికి టి.ఆర్.ఎస్. ప్రభుత్వం కుట్రలు పన్నుతుందని, ధర్నా చౌక్ ను ఎత్తివేసి ప్రజా ఉద్రమాలను అణచివేయడానికి కెసిఆర్ కుట్రలు పన్నుతున్నడాని ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం రవీందర్, ఎఐటియుసి జిల్లా కార్యదర్శి బోగే ఉపేందర్ లు ఆరోపించారు. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ పరిరక్షణ కోసం ఢిల్లీలో సోమవారం రోజున జంతర్ మంతర్ వద్ద జరుగు ధర్నాకు వెళ్ళడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెఎసి జిల్లా కన్వీనర్ రమేష్ నాయకులు రాకేష్, రమేష్,అనిల్ తదితరులు పాల్గొన్నారు..
No comments:
Post a Comment