గోలేటి సింగరేణి జి ఎం కార్యాలయంలో 71వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 15 ; బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ కార్యాలయంలో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.జనరల్ మేనేజర్ కే .రవిశంకర్ ప్రెతాకావిష్కరణ గావించి ప్రసంగిస్తూ ఎందరో మహనీయుల త్యాగఫలంగ లభించిన స్వాతంత్ర్యాన్ని మనం కాపాడుకోవాలని,చేసే ప్రతిపనిని నిబద్దతతో నిర్వహించాలని తెలిపారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఏరియా ఉత్తమ కార్మికులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందచేశారు. అవార్డులు అందుకున్నకార్మికులు ఖైర్గుడా ఓపెన్ కాస్ట్ కోడూరి రమేష్ ఎఎపి ఆపరేటర్,ఎస్ రమేష్ ఫిట్టర్, దొర్లి ఓపెన్ కాస్ట్ మంద రాములు ఈ పి ఆపరేటర్, ఎస్ రమణారెడ్డి ఈ పి ఎలక్ట్రికల్, ,బె పి ఏఓపెన్ కాస్ట్ 2 ఎక్స్టెన్షన్ ఎస్ గిరీష్ చంద్ర ఈ పి ఆపరేటర్ ఆర్ శ్రీనివాస్ ఫిట్టర్, , ఉత్తమ ఉద్యోగిగా ,కోరుట్ల యాదగిరి ఈ పి ఆపరేటర్ ను బెల్లంపల్లి ఏరియా నుండి సెలెక్ట్ చేసి కొత్తగూడెం సెంట్రల్ ఫంక్షన్కు పంపించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమం లో అధికారులు కార్మికులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment