Wednesday, 30 August 2017

శ్రామికుల హక్కుల సాధన ఏ ఐ టి యూ సి తోనే సాధ్యం : అంబాల ఓదెలు

శ్రామికుల హక్కుల సాధన ఏ  ఐ టి యూ సి తోనే  సాధ్యం : అంబాల ఓదెలు

  కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 30 ;   శ్రామికుల హక్కుల సాధన ఏ  ఐ టి యూ సి తోనే  సాధ్యం అని  ఏ  ఐ టి యూ సి జిల్లా ప్రధాన కార్యదర్శి  అంబాల ఓదెలు అన్నారు. బుధవారం రెబ్బెన మండలం గోలేటిలోనే కేఎల్   మహేంద్ర భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ  కార్మికుల హక్కుల సాధనకై నిరంతరం శ్రమించే కార్మిక  సంఘం   ఏ  ఐ టి యూ సిమాతృసమేనని రాబోయే సింగరేణి కార్మిక ఎన్నికలలో అందరు తమ యూనియన్ నే సమర్ధించాలని కోరారు.  ప్రస్తుతమున్న టి జి బి కే ఎస్ కార్మికుల సమస్యలు పట్టించుకోకుండా ,వారసత్వఉద్యోగాలపై అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తూ,జాతీయ యూనియన్లను తప్పుపట్టుతున్నాయని తెలిపారు. కార్మిక హక్కులకోసం పోరాడే  ఏ  ఐ టి యూ సి ని గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో గోలేటి బ్రాంచ్ కార్యదర్శి ఎస్ తిరుపతి, ఖైర్గుడా పిట్ కార్యదర్శి జూపాక రమేష్, నాయకులూ జాడి తిరుపతి, సురేంకురి తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment