నూతన సాంకేతికత లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ప్రోత్సాహం అందిస్తాం ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 20 ; జిల్లా లో ప్రారంబించిన నూతన సాంకేతికత లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి నెల నెల ప్రోత్సాహకాలు అందిచి వారిని ప్రోత్సహిస్తామని జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్ తెలిపారు, సి.సి.టి.ఏన్.స్ జిల్లా లో ప్రవేశ పెట్టిన అప్పటినుంచి , ఇప్పటి వరకు,సి.సి.టి.ఏన్.స్ నమోదు,వినియోగం మరియు సి.సి.టి.ఏన్.స్ యొక్క ప్రగతి ను జిల్లా ఎస్పి పర్యవేక్షించారు, అందులో బాగముగా ఈస్గం పోలీస్ స్టేషన్ నుంచి బబ్బెర శేఖర్ పీ.సి-3257 ను జిల్లా ఎస్పి ఎంపిక చేసి నగదు బహుమతి వేయి రూపాయలను ప్రోత్సాహకము ను అందించి అబినంధించారు.జిల్లా లో ఆధునిక సాంకేతికతను అందుబాటులో తిసుకువస్తున్నామని దానికి అనుగుణముగా ప్రజలకు సేవలు నిత్య నూతనముగా మార్పుచేయబడి సేవలు సరళ తరం అవుతాయని జిల్లా ఎస్పి తెలిపారు .ఈ కార్యక్రమము లో డిఎస్పి హబీబ్ ఖాన్ , జిల్లా లోని సి.ఐ లు , ఎసై లు జిల్లా ఐ.టి కోర్ సిబ్బంది జే. శ్రీనివాస్, మాణిక్ రావు ,రమేష్,పోలీస్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ సూర్య కాంత్ , యం.డి.ఇంతియాజ్, పాస్ పోర్ట్ కార్యాలయ అధికారి మురళి , ఫింగర్ ప్రింట్ విబాగము అధికారులు ఏ. తిరుపతి , మరియు పీ.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.
No comments:
Post a Comment