Saturday, 19 August 2017

మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ అమలుతీరుపై డి ఎం హెచ్ ఓ పరిశీలన

మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ అమలుతీరుపై  డి ఎం హెచ్ ఓ  పరిశీలన 



కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ;  ప్రతిఒక్క విద్యార్థికి    మీజిల్స్ రుబెల్లా వాక్సినేషన్ తప్పనిసరిగా వేయాలని డి ఎం హెచ్ ఓ సుబ్బరాయడు అన్నారు. ఈ ప్రక్రియ  అమలు తీరును పరిశీలించడానికి ఈ రోజు  డి ఎం హెచ్ ఓ     సుబ్బారాయుడు రెబ్బెన మండలంలో  ఆకస్మికంగా తనిఖీ చేసారు. మండలంలోని ఫాసిగం, గంగాపూర్ గ్రామాలలోని పాఠశాలలో వాక్సినేషన్ ప్రక్రియను గమనించారు.రెబ్బెన ప్రాధమిక ఆరోగ్య కేంద్రం    వైద్యురాలు డాక్టర్ నాగమణి,  ,సిబ్బంది, ఆయన వెంట ఉన్నారు.

No comments:

Post a Comment