Friday, 4 August 2017

రాఖి పండగ సందర్బంగా సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం

రాఖి పండగ సందర్బంగా సిస్టర్ ఫర్ చేంజ్ కార్యక్రమం 

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి)  రెబ్బెన ఆగష్టు 04;  ఎం పి  కవిత ప్రారంభించిన  సిస్టర్ ఫర్ చేంజ్  కార్యక్రమం స్ఫర్తిని చాటడానికి తెలంగాణ జాగృతి విద్యార్ధి సమైక్య ఆధ్వర్యంలో రెబ్బెన మండల కేంద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం సమావేశం  నిర్వహించారు. ఈ సమావేశానికి  ముఖ్య అతిధిగా రెబ్బెన  ఎస్ ఐ నరేష్ కుమార్ హాజరయ్యారు . ఈ సందర్భంగా  మాట్లాడుతూ  రోడ్డు ప్రమాదాలలో ఎంతో   మంది హెల్మట్ లు ధరించక  ప్రాణాలు   కోల్పోవడం  జరుగుతుందని  ,ద్విచక్ర వాహనదారులు తప్పక శిరస్త్రాణం ధరించాలని ఎంపీ కవిత ప్రారంచిన  సిస్టర్ ఫర్ చేంజ్ అనే కార్యక్రమ విశిష్టతను గుర్తించి ఈ రాఖి పండగకు అక్క చెల్లలు అన్నదమ్ములకు హెల్మట్ ను బహుకరించాలని  సూచించారు. ఈ కార్యక్రంలో  తెలంగాణ జాగృతి విద్యార్ధి సమైక్య నియోజక వర్గ  కన్వీనర్ తణుకు సాయి శ్రావణ్,రవి, రాజ్కుమార్, శ్రీకాంత్,వెంకటేష్, సతీష్ తదితరులు ఉన్నారు. 

No comments:

Post a Comment