బెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో హరిత హారం
కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన ఆగష్టు 17 ; తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమాన్నిబెల్లంపల్లి ఏరియా సింగరేణి ఆధ్వర్యంలో గురువారం రెబ్బెన మండలంలోని గోలేటి క్రాస్ రోడ్ వద్దనున్న సి ఎస్ పి ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎం ఎల్ ఏ కోవా లక్ష్మి, జిల్లా పాలనాధికారి చంపాలాల్, జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ సన్ ప్రీత్ సింగ్ లు హాజరై విద్యార్థులతో కలసి మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ మొక్కలను నాటడంలో విద్యార్థులు ముందుండాలని,అదే విధంగా నాటిన మొక్కలకు ప్రతి రోజు నీరు పోసి సంరక్షించడంలో కూడా శ్రద్ధ పెట్టాలని అప్పుడే సమస్త మానవాళికి ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు. మొక్కలు నాటుతూ సమాజ శ్రేయస్సు కు పాటుపడాలన్నారు.ఇప్పుడు నాటిన మొక్కలను సంరక్షిస్తే అవి రేపటికి వృక్షాలు అవుతాయని,వాటితో ప్రాణవాయువు లభిస్తుందని అన్నారు.మొక్కలు మనిషి జననం నుండి మరణం వరకు ప్రత్యక్షంగానూ,పరోక్షంగానూ ఉపయోగపడుతున్నాయి అని అన్నారు.హరిత హారంలో నాటిన మొక్కలను సంరక్షిస్తే రేపటి వృక్షాలై మన తెలంగాణ హరిత తెలంగాణగ మారుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షులు కార్నాథం సంజీవ్ కుమార్,జిల్లా ప్రాదేశిక సభ్యులు అజ్మీర బాబురావు,సర్పంచ్ పెసరు వెంకటమ్మ,తహసీల్దార్ బండారి రమేష్ గౌడ్,యంపిడిఓ సత్యనారాయణ సింగరేణి సంస్థ జనరల్ మేనేజర్ జి రవిశంకర్, ,మండల విద్యాధికారి వెంకటేశ్వర స్వామీ ఆసిఫాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ గండం శ్రీనివాస్, ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మెన్ కుందారపు శంకరమ్మ, మండలంలోని సర్పంచులు,ఎంపిటిసి లు ,విద్యార్థులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment