Saturday, 19 August 2017

కిలిమంజారో పర్వతం అధిరోహించిన విద్యార్థిని అబినందించిన ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

  కిలిమంజారో పర్వతం అధిరోహించిన విద్యార్థిని అబినందించిన ; జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్

కొమురంభీం ఆసిఫాబాద్ (వూదయం ప్రతినిధి) రెబ్బెన  ఆగష్టు 19 ; మొట్టమొదటి సారి తెలంగాణా నుంచి ఆసిఫాబాద్ జిల్లా గిరిజన పాటశాల ల తరుపున  సౌత్ ఆఫ్రికా లోని కిలిమంజారో  పర్వతం ను అధిరోహించిన విద్యార్ధి నాయిని మల్లేష్  (14 సంవత్సరాలు) ను  శనివారం స్థానిక జిల్లాలోని పోలీస్ హెడ్ క్వార్టర్ లొ  జిల్లా ఎస్పి సన్ ప్రీత్ సింగ్  శాలువా తో సత్కరించి మెమోంట్ అందచేసి ఘనముగా సత్కరిచారు. నాయిని మల్లేష్ 14 సంవత్సరాలు ల వయసుల్లో దృడ సంకల్పం తో అత్యున్నత శిఖరం ను అధిరోహించడం చాల ఆనందం గా వుందని , భవిష్యతు లొ కూడ ఎవరెస్ట్  వంటి పర్వతాలను  అధిరోహించి జిల్లా కు మరియు రాష్ట్ర నకు  మంచి పెరు  తీసుకు రావాలని , మల్లేష్ ఆదర్శం తో  విద్యార్థులు అందరు అత్త్యున్నతo గా ఎదగాలని  జిల్లా ఎస్పి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమము లొ  డిఎస్పి హబీబ్ ఖాన్ ,జిల్లా  సి ఐ లు మరియు ఎసై లు , స్వరోస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ ఉషన్న, లక్ష్మన్ దాస్ , హేమంత్ షిండే , చైతన్య ,శ్రినివాస్ మరియు పి.ఆర్.ఓ మనోహర్ లు పాల్గొన్నారు.   

No comments:

Post a Comment