బెల్లంపల్లి ఏరియాకు రెండు కాంస్య పథకాలు
కొమురంభీం జిల్లా ఆసిఫాబాద్ , (వుదయం) రెబ్బెన మార్చి3 ;భూపాలపల్లిలో గత నెల ఫిబ్రవరి 25 ,26 తేదీలలో జరిగిన కోల్ ఇండియా పోటీలలో బెల్లంపల్లి ఏరియా నుండి ఐదుగురు క్రీడాకారులు పాల్గొనగ ఇద్దరు క్రీడాకారులు కాంస్య పథకాలు సాధించినందున వారిని ఏరియా జనరల్ మేనేజర్ కె.రవిశంకర్ అభినందించారు.ఈ సందర్బంగా జీఎం మాట్లాడుతూ పోటీలలో బెల్లంపల్లి ఏరియా లో పనిచేస్తున్న బి.లక్ష్మి,బి.ఝాన్సీలు పాల్గొని కాంస్య పథకాలు సాధించడం బెల్లం పల్లి ఏరియా గర్వకారణం అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో డిజిఎం పర్సనల్ జె.చిత్తరంజన్ కుమార్,డీవైపీఎం ఏ.రాజేశ్వర్,స్పోర్ట్స్ సూపర్ వైజర్ హెచ్.రమేష్,క్రీడాకారులు పాల్గొన్నారు
No comments:
Post a Comment