Wednesday, 8 March 2017

సింగరేణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

సింగరేణి ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు 

 కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 08 ;  అంతర్జాతీయ మహిళా దినోత్సవం  సందర్భంగా  బుధవారం నాడు రెబ్బెన మండలం  గోలేటి  సింగరేణి పాఠశాలలో ఏర్పాటు చేసినా సమావేశంలో  సింగరేణి  సేవ అధ్యక్షురాలు   అనురాధ రవి శంకర్ మరియూ ఏరియా జి యం రవి శంకర్ లు   ముఖ్య అతిధులుగా  పాల్గొని మహిళలకు మహిళా దినోత్సవం   శుభాకాంక్షలు తెలిపి  మాట్లాడారు. మహిళలు ఆర్ధికంగా సామాజికంగా ఎదగాలని స్త్రీ ల పై గృహ హింస విడనడలని అన్నారు.  ఈ వేడుకలను ఘనంగా నిర్వహించడం చాల సంతోషకరం అని అభినందించారు. అదే విధంగా మహిళలు విద్యా పరంగా ఎదగాలని సూచించారు. మహిళలకు  ఆటల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులను అందచేశారు.  సేవ అధ్యక్షురాలు   అనురాధ రవి శంకర్ ను   పలువురు శాలువాతో  సన్మానించ్చారు. ఈ కార్యక్రమంలో డి జి ఎం పరసనల్ జె చిత్తరంజన్ కుమార్, సేవ  సభ్యురాలు కుందారపు శంకరమ్మ, సొల్లు లక్ష్మి,కార్మిక నాయకులు ఎస్ తిరుపతి, సదాశివు తదితరులు తదితరులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment