Wednesday, 15 March 2017

కాంట్రాక్టు కార్మికులసమస్యలను పరిష్కరించాలని ధర్నా

కాంట్రాక్టు కార్మికులసమస్యలను పరిష్కరించాలని ధర్నా
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 15 ; సింగరేణి లో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ  సమస్యలు పరిష్కరించాలని బుధవారం రెబ్బెన మండలం లోని  గోలేటి జీఎం  కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు .  ఏఐటీయూసీ బోగే ఉపేందర్ మాట్లాడుతూ  చాల కాలం నుండి తక్కువ వేతనం కు  పనిచేస్తన్నమని వేజ్ బోర్డు లో ఒప్పందం జరిగిన మొదటి క్యాటగిరి   వేతనాన్నివెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వస్తే సమస్యలు పరిష్కారం అవుతాయి అనుకుంటే స్వరాష్ట్రం లో కూడా కార్మికులు అనేక ఇబ్బందులు ఎదురుకోవాల్సి వస్తుందని అన్నారు.కాంట్రాక్టు కార్మికులను పెర్మనెంట్ చేస్తా అని అన్న  రాష్ట్ర  ముఖ్యమంత్రి  కే సి ఆర్  ఎన్నికల సందర్బంగ ఇచ్చిన  హామీ ని వెంటనే నెరవేర్చాలని అన్నారు.   సమస్య పరిష్కారం కాకుంటే ఆందోళనలు ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ సమ్మె లో కాంట్రాక్టు  కార్మికులు రాయిలా నర్సయ్య,  బండారు తిరుపతి,చల్లూరి అశోక్, రామస్వామి , మొగిలి ఐఫ్టీయూ   చంద్ పాషా  , సికిందర్  కార్మికులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment