Saturday, 11 March 2017

ఒంటిపూట బడులను నిర్వహించాలి

ఒంటిపూట బడులను నిర్వహించాలి 
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా  (వుదయం) రెబ్బెన మార్చి 11 ;  మార్చ్ 15 నుండి రాష్ట్ర  ప్రభుత్వం ఒంటిపూట బడులను నిర్వహించాలని పి ఆర్ టి  యూ ఉపాధ్యాయుల సంగం కోరుతుంది శనివారం పి  ఆర్ టి యూ అద్వర్యం లో రెబ్బెనలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పి ఆర్ టి యూ మండల అధ్యక్షులు ఖాదర్ మాట్లాడుతు ప్రతి ఏడాది రాష్ట్ర  ప్రభుత్వం  మార్చ్ 15 నుండి  ఒంటిపూట బడులను నిర్వహించెది అన్నారు. ఈ  ఏడాది రెండు పుటలు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నాదని దింతో విద్ద్యార్థులు  ఎండా వేడిమికి, మంచినీటికి ఇబ్భదులు పడుతున్నారు అన్నారు. ఎండా తీవ్రత అధికంగా ఉండటం వలన రెండు పూటలా నిర్ణయాన్ని ఉప సంవరించు కోవాలని  అన్నారు. ఈ కార్యక్రమం లో పి ఆర్ టి  యూ మండల ప్రధాన  కార్యదర్శి ఢీ రవి కుమార్, జిల్లా కౌన్సలర్  ఎస్ వెంకటేష్, అషోషన్ అధ్యక్షులు మల్లేష్, కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. 

No comments:

Post a Comment