బీసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడిగా ఆంజనేయులు గౌడ్
(రెబ్బెన వుదయం ప్రతినిధి); బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడుగా అంజనేయులు గౌడ్ ను ఏక గ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు విజిఅర్ నారగోని తెలిపారు. హైదరాబాద్ లోని బషీర్ భాగ్ ప్రెస్ క్లబ్ లో బిసి ఐక్య సంఘర్షణ సమితి రాష్ట్ర మహా సభలోజరిగిన ఎన్నికలో రెబ్బెన మండలం గోలేటి గ్రామానికి చెందిన కేసరి అంజనేయులు గౌడ్ ని ఎన్నుకున్నారు. బిసి ఐక్య సంఘర్షణ సమితి గత మూడు పర్యాయాలుగా జిల్లా ఆధ్యక్షుడుగా 10సం రాల నుంచి బిసి హక్కులకై పోరాటాలు చేస్తు జిల్లా అధ్యక్షుడుగా కొనసాగారు . బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులుగా ఏక గ్రీవంగా ఎన్నికవడం పట్ల బిసి ఐక్య సంఘర్షణ సమితి జిల్లా కార్యదర్శి భోగె . ఉపేందర్ , మండలాద్యక్షుడు పాలగాని పర్వతాలు , ఉపధ్యక్షుడు సియఃచ్. శ్రీనివాస్ , రాయిల్ల . నర్సయ్య , కార్యదర్శి రామగిరి . సతీష్, మానేం . సంతోష్ లు సంతోషం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment