ఫీల్డ్ అసిస్టెంట్లు నిరవదిక సమ్మె
(రెబ్బెన వుదయం ప్రతినిధి);రెబ్బెన మండలంలోని మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాది హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు . గురువారం రోజున ఎమ్ పి డి ఓ కార్యాలయం ముందు క్షేత్ర సహాయకుల సంఘo పిలుపు మ్మేరకు నిరవదిక సమ్మె చేపట్టారు. వీరికి ఎ ఐ టి యు సి సంపూర్ణ మద్దతు తెలిపింది ఫీల్డ్ అసిస్టెంట్ల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిస్కరించారాలని ఎ ఐ టి యు సి జిల్లా సమితి సభ్యులు బోగే ఉపేందర్ ఎ ఐ టి యు సి మండల కార్యదర్శి రాయల నర్సయ్య డిమాండ్ చేసారు అనంతరం మాట్లాడుతూ గత 12 సంవత్సరాలుగా క్షేత్ర స్తాయిలో విదులు నిర్వహిస్తున్నామని చాలి చాలని వేతనాలతో ఉద్యోగాలు చేస్తున్నామని అని అన్నారు మా సమస్యల పరిష్కరాల కోసం 2015 లో 50 రోజులు సమ్మె చేయగా ప్రజా ప్రతినిధులతో చర్చలు జరిపి హామీ ఇచ్చి మరచి పోయారు అని అన్నారు నేటికి 11 నెలలు గడుస్తున్న ప్రభుత్వం సమస్యలను పరిశీలించడం లో విఫలం అయింది అని తేలిపారు జిల్లా రాష్ట్ర కమిటి పిలుపు మేరకు సమ్మె నిర్వహిస్తున్నామని రేగ్యులర్ చేయాలనీ అన్నారు ఫీల్డ్ అసిస్టంట్లకు కనీసం వేతనం 15000 చెల్లించాలని అన్నారు ఫీల్డ్ అసిస్టంట్ లకు మండల బదిలీ ఏర్పాటు చేయాలనీ అన్నారు జి ఓ నంబర్ 491 ప్రకారం ప్రతి కుటుంబ సభ్యులకు ఆరోగ్య కార్డులు ఉద్యోగులకు అర్హులను బట్టి ఇక్రిమెంటులు ఇవ్వాలని అన్నారు ఈ నిరవదిక సమ్మె ఫీల్డ్ అసిస్టంట్ లు జె . శ్రీనివాస్, కె. మొగిలి, తుకారం, స్వప్న, డి గణపతి ,దేవానంద్ జి . తిరుపతి ఎమ్ . వెంకటేశం ఉన్నారు
No comments:
Post a Comment